రామాయణము
అయోధ్యకాండ -డబ్బదినాలుగవసర్గ
భరతుడు ఆ విధముగా తన తల్లిని నిందించిన పిమ్మట మిక్కిలి క్రుద్ధుడై ఆమెతో మఱల ఇలా అనెను . "క్రూరురాలా !దుర్మార్గురాలా !నీవు ధర్మభ్రష్టురాలవు . కావున ఈ రాజ్యము నుండి వెళ్లిపొమ్ము . మహారాజు మరణించినందుకు ఏడవకుము . నేను మరణించినట్టు భావించి జీవితాంతము ఏడువుము . నీ కారణముగానే మహారాజు మృత్యు ముఖమును చేరినాడు . నీవలనే శ్రీరాముడు అడవులకు వెళ్ళినాడు . నీ కారణముగనే నేను అపకీర్తి పాలయ్యాను . నీవు నాకు తల్లి రూపమున వున్న శత్రువువు . పతి హత్యకు పాల్పడినావు . కనుక నీతో నేను ఇక మాట్లాడను .
మహాబలశాలి అయిన శ్రీరాముని ఇచటకు రప్పించి ఆయనకు మారుగా నేను దండకారణ్యములకు వెళ్లెదను . ఆప్తులు ,జెనులు అందరూ దీన వదనములతో ఏడ్చుచు ,నన్ను చూచుచుండగా నేను ఈ పాపభారమును మోయలేను . శ్రీరాముడు వచ్చి రాజ్యము చేపట్టినప్పుడు కానీ నాకు ఈ కళంకము తొలగదు "అంటూ ఏడుస్తూ భరతుడు కిందపడిపోయెను .
రామాయణము అయోధ్యకాండ డెబ్బదినాలుగవసర్గసమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment