Sunday 8 January 2017

రామాయణము అయోధ్యకాండ -డెబ్బదిఒకటవసర్గ

                                    రామాయణము 

                             అయోధ్యకాండ -డెబ్బదిఒకటవసర

మిగుల పరాక్రమశాలి అయిన భరతుడు ఆ విధముగా" రాజగృహము" అను తాతగారి ఊరి నుండి బయలుదేరి నదులను ,వనములను దాటుతూ ప్రయాణించెను . ఆ రోజు రాత్రి "వరూదము"అను పేరు కల పురములో విశ్రమించెను . వేకువ జామునే తిరిగి ప్రయాణము ఆరంభించి ఆ రోజు రాత్రి "సర్వ తీర్ధ " అనే పురములో విశ్రమించెను . మరునాడు ప్రాతః కాలమునే లేచి అయోధ్య దిశగా ప్రయాణము సాగించెను . అయోధ్యలో ప్రవేశించిన భరతుడికి అయోధ్య అంతా కళాహీనంగా ఎవరి గుమ్మముముందు ముగ్గులు లేక ,గృహములన్నియు పాడుబడినవాటి వలె అగుపించెను  . జనుల ముఖములలో ఆనందము అన్నది లేక ఉండెను . ఎల్లప్పుడూ సంగీత  ,వాద్య శబ్దములు వినపడుతూ  గజములు ,గుర్రములు వీధులలో తిరుగాడుతూ మిక్కిలి సందడిగా  ఆ పుర వీధులన్నీ ఉండెడివి . కానీ ఇపుడు వీధులన్నియు నిశ్శబ్దముగా ఉండెను . 
ఈ పరిస్థితులన్నియు గమనించిన భరతుడు ఏమి జరిగినదో అని మనసు కీడు శంకించుచుండగా ,తనకు వచ్చిన కలలో  దశరధుడు పడిన బాధను తలచుకుంటూ ,మిక్కిలి వేగముగా దశరధుని భవనమునకు చేరెను . 

రామాయణము అయోధ్యకాండ డెబ్బది ఒకటవసర్గ సమాప్తము . 

           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




No comments:

Post a Comment