Monday 30 January 2017

రామాయణము అయోధ్యకాండ _ఎనుబదిమూడవసర్గ సమాప్తము .

                                   రామాయణము 

                             అయోధ్యకాండ _ఎనుబదిమూడవసర్గ సమాప్తము . 

భరతుడు ప్రాతః కాలమునే లేచి శ్రీరాముని చూడవలెననే కోరికతో ఉత్తమమయిన రథములను అధిరోహించి త్వరత్వరగా బయలుదేరెను . మంత్రులు పురోహితులు మున్నగువారు మేలుజాతి గుఱ్ఱములు తో కూడిన రధములపై భరతునికి ముందు భాగమున ప్రయాణించుచుండిరి . 9 వేల ఏనుగులు భరతుని అనుసరించెను . వివిధాయుధములతో విలుకాండ్రు అరువదివేల రధములతో భరతుని అనుసరించిరి . ఇంకనూ లక్షమంది అశ్వికులు తమ గుఱ్ఱములపై భరతుని వెంట సాగిపోయిరి . కౌశల్య ,సుమిత్ర ,కైకేయి సైతము రామలక్ష్మణులను చూడవలెననే కోరికతో ఆ యాత్రలో పాల్గొనిరి . పిదప బ్రాహ్మణాది త్రివర్ణముల వారు ,వివిధ వృత్తులవారు రామలక్ష్మణులను చూచు వేడుకతో భరతుని వెంట సాగిపోవుచు ,ఆ సోదరుల అపూర్వ గాధలను తమలో తాము ప్రస్తావించుకొనుచు ఆనందమును పొంగిపోవుచుండిరి . 
ఆవిధముగా అందరూ సంతోషముతో భరతుని అనుసరించి ముందుకు సాగుచుండిరి . శృంగిబేరి పురము చేరి గంగానదీ తీరమున విశ్రాంతి తీసుకొనుటకు సేనలకు ,తనతో వచ్చిన జనులకు భరతుడు  ఆదేశము ఇచ్చెను . ఆ గంగా జలములలో దశరధుని తర్పణములు విడిచి ,పిదప తన స్థావరంలో విశ్రమించి ,రాముని తిరిగి రాజ్యమునకు తెచ్చుటకు ఉపాయములు ఆలోచించుచు అచట వసించెను . 

రామాయణము అయోధ్యకాండ ఎనుబది మూడవసర్గ సమాప్తము . 

           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment