Sunday 15 January 2017

రామాయణము అయోధ్యకాండ --డెబ్బది అయిదవసర్గ

                                          రామాయణము 

                              అయోధ్యకాండ --డెబ్బది అయిదవసర్గ 

భరతుని రాకను గురించి తెలుసుకున్న సుమంత్రుడు మొదలగు  మంత్రులు కైకేయి భవనమునకు వచ్చిరి . స్పృహ తప్పి పడిపోయి వున్నా భరతుడు కొద్దిసేపటికి మేల్కొని "మంత్రులారా !నేను ఎన్నడూ ఈ రాజ్యాధికారమును కాంక్షించలేదు . దానిని గూర్చి తల్లితో ఆలోచన చేసి ఎరుగను . శ్రీరాముని వనవాసము మున్నగు విషయములేవి నేను ఎరుగను ఏలననగా నేను ఇక్కడ లేను మా తాతగారి ఇంట ఉంటిని . "అని ఏడుస్తూ గగ్గోలు పెట్టెను . 
పిమ్మట భరతుడు కౌశల్యాదేవి భవనమునకు బయలుదేరెను . అక్కడ కౌశల్యాదేవి మాసిన వస్త్రములతో ,తనువు కృశించి దుఃఖిస్తూ ఉండెను . భరతుడు శత్రుఘ్నుడు దూరము నుండే కౌశల్యను చూసి వారు కౌగలించుకుని ఏడ్చిరి .అప్పుడు కౌశల్యా మాత "నాయనా !భరతా !మీ తల్లి కైక వరముల పేరుతొ  శ్రీరాముని వనవాసములకు పంపినది . ఆ బాధతో దశరథ మహారాజు మరణించెను . వీటి వల్ల ఆమె ఏమి బాగుకున్నదో తెలియదు మీ అమ్మ నన్ను కూడా అడవులకు పంపితే బాగుండును . అటుల జరగనిచో నేనే ఆత్మాహుతి చేసుకొనెదను . మీ తల్లి దయ వలన నీకు ఈ రాజ్యలక్ష్మి ప్రాప్టించినది . "అని పలికెను . 
ఆమె మాటలు విన్న భరతుడు కౌశల్యాదేవి పాదములపై పడి ఏడ్చుచు "మాతా !అన్న రాముడనిన నాకును అమితమైన ప్రేమ ఈ రాజ్యమును నేను కలలో కూడా ఆశించలేదు . ఈ జరిగిన పరిణామములు ఏవి నాకు తెలియదు నన్ను నమ్ము "అని పలు రకములుగా వాగ్ధానములు చేస్తూ ఏడ్చెను . 

రామాయణము అయోధ్యకాండ డెబ్బది అయిదవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ ,(తెలుగు ),తెలుగు పండితులు . 




 

No comments:

Post a Comment