Sunday 22 January 2017

రామాయణము అయోధ్యకాండ-డెబ్బది ఏడవసర్గ

                                             రామాయణము 

                                    అయోధ్యకాండ-డెబ్బది ఏడవసర్గ 

పది దినములు గడిచిన పిమ్మట పదునొకండవ దినమున శుచియై శుద్ధి ,ఫుణ్యావచనాది కార్యక్రమములను ఆచరించెను . పన్నెండోవదినమున షోడసము ,సపండీకరణము మొదలగు శ్రార్ధ కర్మలను అతడు నిర్వహించెను . పిమ్మట భరతుడు బ్రాహ్మణులకు ,బంగారము ,రత్నములు ,ధనము మొదలగు వాటిని దానము చేసెను . సమృద్ధిగా అన్నదానము చేసెను . ఆ రాజకుమారుడు మహారాజుకి ఉత్తమగతులు లభించుటకు విప్రోత్తములకు ఇంకనూ మిక్కిలి తెల్లని ఉన్ని శాలువాలు ,వేలకొలది గోవులు ,దాస దాసీ జనములను ,వస్తు సమూహములను ,అందమైన గృహములను దానము చేసెను . 
పిమ్మట పదమూడవ దినము ప్రాతః కాలమున భరతుడు విలపించుచు అస్తి సంచయనార్ధము స్మశానమునకు వెళ్లెను . అచట చితా భస్మము ,ఎముకలు చెల్లాచెదురుగా ఉండెను . అది చూచి కన్నీటి ప్రవాహమును ఆపుకోలేక ఏడవసాగెను . శత్రుఘ్నుడు సైతము ఎక్కీఎక్కి ఏడవసాగెను . వారిరువురు పూర్వము తండ్రి వారితో వున్న సందర్భములను తలచుకుని ఏడవసాగెను 
"తినఁడ్రీ భోజన సమయముల నందు నీవు మాకు కొసరికొసరి తినిపించెడివాడవు . పానీయములు తాగించెడివాడవు . మాకు నచ్చెడి వస్త్రములను మమ్ము అడిగి తెలుసుకుని మాచేత ధరింపచేసేవాడవు . ఇప్పుడు మమ్ము ఆవిధముగా ఎవరు చూచెదరు . మా కిపుడు అంత గారాబముతో ఎవరు విచారణ చేయుదురు . "అంటూ పలుపాలు విధములుగా తలుచుకుని మిక్కిలి శోకముతో ఎడ్వాసాగిరి . అప్పుడు సుమంత్రుడు శత్రుఘ్నుడిని లేపి వారిరువురికి జననమరణములు అనివార్యమని బోధించెను . అప్పుడు వారు కన్నులు తుడుచుకుని బాధను దిగమింగుతూ లేచి నిలబడిరి . అపుడు వారిరువురిని మంత్రులు ఇంకను మిగిలి వున్న అస్తి సంచయాది కార్యములు నిర్వహించుటకై తొందరపెట్టసాగిరి . 

రామాయణము అయోధ్యకాండ డెబ్బది ఏడవసర్గ సమాప్తము . 

            శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







No comments:

Post a Comment