Friday 6 January 2017

రామాయణము అయోధ్యకాండ -అరువది ఎనిమిదవసర్గ

                                           రామాయణము 

                          అయోధ్యకాండ -అరువది ఎనిమిదవసర్గ 

మార్కండేయాది మహర్షుల మాటలు విన్న వశిష్ట మహర్షి "ప్రస్తుతము భరతుడు ,తన సోదరుడు అయిన శత్రుఘ్నుడితో కలసి తన మేనమామ ఇంట హాయిగా వున్నాడు . అతడికి ఇక్కడి విషయములు ఏమి తెలియవు .కావున శీఘ్రముగా పోవు గుఱ్ఱముల పై విస్వాసపాత్రులైన దూతలను అచటికి పంపి భరతశత్రుఘ్నులను ఇచటకు రప్పింతుము . "అని పలికి 
సిద్దార్థ ,విజయ ,జయంత ,అశోక ,నందన అను పేర్లు కల దూతలను పిలిచి "నాయనలారా !మీరు అతిశీఘ్రముగా కేకేయ రాజ్యమునకు వెళ్లి భరతశత్రుఘ్నులను  ఇచటకు తీసుకు రావలెను . వారికి ఇక్కడి విషయములు ఏమియు తెలుపరాదు . మీ ముఖముమీద శోకాచిహ్నములు కనపడనీయక నా ఆజ్ఞను పాటించవలెను "అని తెలిపెను . 
అంతట వారు దారిఖర్చులు తీసుకుని ,తమ ఇంటి వారికి చెప్పి శీఘ్రముగా బయలుదేరి అనేక ప్రాంతములు ,ఎత్తయిన ప్రదేశములు ,అరణ్యములను దాటుతూ ఆగమేఘములమీద కైకేయ రాజ్యమయిన" గిరివ్రజపురము"ను చేరిరి . అప్పటికి రాత్రి అయినను ,వారు గుఱ్ఱములు మిక్కిలి అలసిపోయి ఉన్నను దశరథ మహారాజు ఆత్మశాంతి కొరకు ,ఇక్ష్వాకు వంశజుల రక్షణ కొరకు ,ఆ ప్రభువుల వంశ పేరుప్రతిష్టలు నిలుపుటకు త్వరత్వరగా ఆ పురమున ప్రవేశించిరి . 

రామాయణము అయోధ్యకాండ అరువది ఎనిమిదవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







No comments:

Post a Comment