రామాయణము
అయోధ్యకాండ -డబ్బదియవ సర్గ
భరతుడు ఇలా తన మిత్రులకు తన స్వప్నవృత్తాన్తమును వివరించుచుండగా వశిష్ఠుడు పంపిన దూతలు అచటికి విచ్చేసి "రాకుమారా !భారతా !అయోధ్యలో నీవు శీఘ్రముగా నిర్వర్తింపవలసిన బాధ్యత ఒకటి వున్నది . కావున వేగిరమే బయలుదేరి అయోధ్యకు రండు ". అని పలికిరి ఇంకనూ "మీ తాతగారికి ,మేనమామగారికి వస్త్రములు అయోధ్య నుండి మీ కొరకు పంపినారు వాటిని గ్రహించి మీ తాతగారికి ,మేనమామగారికి బహూకరించండి "అని పలికిరి .
బంధు మిత్రులయెడ ప్రేమాభిమానములు కల భరతుడు తండ్రి,తల్లులు రామలక్ష్మణులు ,కులగురువుల కుశలములు అడిగెను . అందుకు ఆ దూతలు అందరూ కుశలమే . శీఘ్రముగా బయలుదేరుము అని తొందరపెట్టిరి . అప్పుడు భరతుడు బహుమతిగా దూతలు తెచ్చిన వస్త్రములను శ్వీకరించి తాతగారికి ,మేనమామకు బహూకరించెను . పిదప వారును భరతుడికి అనేక ఆభరణములు ఇచ్చిరి . భరతుడు తాతగారి వద్ద ,మేనమామ వద్ద ,మాతామహి వద్ద అనుమతి పొంది అయోధ్యకు పయనమయ్యెను .
అపుడు కేకేయ రాజు భరతుడికి రక్షణార్ధము అనేకమంది సేనలను పంపెను . చతురంగ బలములు తోడుగా వచ్చుచుండగా తాతగారి ఇంటి నుండి బయలుదేరెను .
రామాయణము అయోధ్యకాండ డబ్బదియవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు .
No comments:
Post a Comment