Monday 30 January 2017

రామాయణము అయోధ్యకాండ -ఎనుబది నాల్గవసర్గ

                                              రామాయణము 

                                            అయోధ్యకాండ -ఎనుబది నాల్గవసర్గ 

ఆ ప్రాంతమునకు రాజైన గుహుడు గంగా తీరమున కల భరతుని సేనను చూచి తన అనుచరులతో " ఈ సమీపముననే ఉన్న మహా సేనను చూడుడు ఇంతటి మహా సేనను నేను మనసున సైతము ఊహించలేదు . ఇది ఓ మహా సముద్రము వలె వున్నది . రాధములపై ఎగురుచున్న ఆ కోవిదారధ్వజము (ఎఱ్ఱకాంచనము )ఇక్ష్వాకు ప్రభువుల చిహ్నము . దీనిని బట్టీ ఆ రధమును ఉన్న వాడు నిశ్చయముగా భరతుడే . అతడు దుర్భుద్ధితో ఇటు వచ్చియుండును . దశరథ మహారాజు యొక్క రాజ్యలక్ష్మి సుసంపన్నమైనది అది ఇతరులకు దుర్లభమయినది . దానిని కైకేయి సుతుడు శాశ్వతముగా హస్తగతము చేసుకోనదలిచినట్లున్నాడు . అందులకు భరతుడు శ్రీరాముని సన్నిహితులమైన మనల్ని భందించుటకాని ,చంపుట కానీ చేయును . పిమ్మట అతడు రాముని అడ్డుని కూడా శాశ్వతముగా తొలగించుకోనున్నాడు కాబోలు . ఏదేమయినా నేను అతడి వద్దకు వెళ్లి విషయము సావధానంగా కనుక్కొని వత్తును . మన సేనను యుద్ధమునకు సిద్దము కమ్మని తెలపండి "
ఆవిధముగా పలికి సేనలకు యుద్ధమునకు సిద్దము కమ్మని ఆజ్ఞను ఇచ్చి విషయము తెలుసుకొనుటకు పండ్లు ,తేనే మున్నగు వస్తువులను తీసుకుని భరతుని వద్దకు వెళ్లి ,భరతుని అనుమతితో గుడారములోకి ప్రవేశించి తానూ తెచ్చిన పండ్లు ,తేనెలు వినయముతో సమర్పించెను . పిమ్మట భరతుని తన ఆతిధ్యము శ్వీకరించి ఈ రాత్రికి తన ఇంట బస చేయవలసినదిగా ప్రార్ధించెను . 

రామాయణము అయోధ్యకాండ ఎనుబది నాల్గవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment