రామాయణము
అయోధ్యకాండ -అరువది అయిదవసర్గ
రాత్రి గడిచి తెల్లవారినది . రోజులాగే రాజుగారిని నిద్రలేపుటకు వందిమాగధులు ,వ్యాకరణ శాస్త్ర పండితులు , సంగీత కుశులురైన గాయకులూ దశరధుని ,వారి వంశమును స్తుతించుచు దశరధుని భవనమునకు వచ్చిరి .ఎంతసేపటికి దశరధుడు బయటకు రాకపోవుటతో వారందరూ కారణమేమిటని శంకించుచు ,వారు అచటనే నిలబడిరి . దశరథ మహారాజుకి సన్నిహితులైన భార్యలు మొదలగు స్త్రీలందరూ చక్కగా తలస్నానములు చేసి అచటికి వచ్చిరి .
వారును మహారాజు ఇంతకీ లేవకపోవుట చూసి మహారాజు వద్దకు వెళ్లి మృదువయిన మాటలతో మహారాజుని నిద్ర లేపుటకు యత్నించిరి . ఎంతకూ ఆయనలో చలనము లేకపోవటంతో వారు అనుమానము వచ్చి ఆయన నాడిని పరిశీలించి మరణించిన విషయము గుర్తించిరి . వెనువెంటనే వారి ఆర్త నాదములతో ఆ భవనము దద్దరిల్లినది . మహారాజుకి దగ్గరలోనే కౌశల్య ,సుమిత్ర రాముని గురించి ఏడ్చి ,ఏడ్చి ఆదమరచి నిద్రిస్తూ వున్నారు . వారు ఈ ఏడ్పులధ్వని విని ఉలిక్కిపడి లేచిరి .
వారు జరిగిన విషయము తెలిసి వారునూ ఏడ్చుచు నేలపై పడిపోయిరి . కౌశల్య ,సుమిత్ర ,కైకేయి ఇంకా మిగిలిన రాణులు అంతః పురస్త్రీల ఏడ్పులకు ఆ భవనము దద్దరిల్లేను . అక్కడ వున్నా స్త్రీలందరూ ఒకరినొకరు పట్టుకుని ఎడ్వాసాగిరి .
రామాయణము అయోధ్యకాండ అరువది అయిదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు .
No comments:
Post a Comment