రామాయణము
అయోధ్యకాండ -అరువది తొమ్మిదవసర్గ
వశిష్ట మహర్షి పంపిన దూతలు ఆ నగరమున ప్రవేశించినంతనే భరతుడు తన స్వప్నమున దశరథ మహారాజు అనేక భాదలు పడుచున్నట్లుగా కలగనెను . తెల్లవారిన పిమ్మట ఆ కాలనీ తలచుకుని మిక్కిలి మానసికవేదనను అనుభవించెను . చింతాగ్రస్తుడైవున్న అతడిని గమనించి అతని ప్రియ మిత్రులు ఆ బాధనుండి ఆయనను బయటకు తీసుకువచ్చుటకు ఒక సభ ఏర్పాటు చేసిరి .
అందు కధలు చెప్పసాగిరి . ఇంకనూ వీణావేణు నాదములను వినిపించిరి . వివిధములగు నృత్యములను ప్రదర్సింపచేసిరి . ఇంకనూ రసరంజకములైన నాటికలను ,నాటకములను ప్రదర్శించిరి . హాస్య ప్రశంగములు కావించిరి . అయినను ఆ రఘువంశజుడు తన విచారము నుండి బయటపడకుండెను .
అప్పుడు భరతుడి మిత్రులు ఆయన విచారమునకు కారణము అడిగిరి . అప్పుడు భరతుడు తనకు వచ్చిన భయంకరమైన కలను గూర్చి వారికి వివరించెను . అందు దశరథ మహారాజు పడుతున్న బాధ నాకు పదేపదే జ్ఞప్తికి వచ్చుటచే తాను ఆ విచారము నుండి బయటపడలేకపోతున్నానని తెలిపెను .
రామాయణము అయోధ్యకాండ అరువదితొమ్మిదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment