Friday 6 January 2017

రామాయణము అయోధ్యకాండ -అరువది ఏడవసర్గ

                            రామాయణము 

                            అయోధ్యకాండ -అరువది ఏడవసర్గ 

అయోధ్య లోని సమస్త ప్రజలకు ఆ రాత్రి ఏడుపులు పెడబొబ్బలతోనే గడిచింది . అందరూ దుఃఖంలో నిండి ఉండుటచే ఆ రాత్రి ఒక యుగములా గడిచెను . ఎవ్వరికి నిద్రలేదు . తెల్లవారిన పిమ్మట రాచకార్యములు నిర్వహించెడి బ్ర్రాహ్మణులందరూ సభ చేసిరి . 
మార్కండేయుడు ,మౌద్గల్యుడు ,వామదేవుడు ,కాశ్యపుడు ,కాత్యాయనుడు ,గౌతముడు ,జాబాలి ,మొదలగు సుప్రసిద్ధ బ్రాహ్మణోత్తములందరూ ,అమాత్యులతో ,రాజపురోహితుడు ,మునిశ్రేష్ఠుడు అయిన వశిష్ట మహర్షి సమక్షమున తమ ,తమ సూచనలు తెలిపిరి . 
రాజులేనట్లయితే వచ్చెడి ఇబ్బందులు చెప్పి దశరధుని పుత్రులలో ఒకరిని రాజుగా చేయమని వశిష్టుని కోరిరి . ఇంకనూ "దశరధుడు బతికి ఉండగా మేము మీ ఆజ్ఞలను పాటించేడి వారము . ఇప్పుడును మీ ఆజ్ఞలను పాటిస్తాము "అని పలికిరి . 

రామాయణము అయోధ్యకాండ అరువది ఏడవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment