రామాయణము
అయోధ్యకాండ -అరువది ఆరవసర్గ
అసువులు వీడిన దశరధ మహారాజుని చూసి కౌశాల్య్ కన్నీరుమున్నీరుగా ఏడ్చుచుండెను . తన భర్త శిరస్సుని వడిలో పెట్టుకుని ఏడ్చుచు ,కైకతో "దుష్టురాలా !నీ కోరికలు తీరినవా ?రాజును అడ్డు తొలగించుకున్నావు . ఇక నిన్ను అడిగేది వారు వుండరు . ఈ సమస్త నెట్టినకొట్టుకొనుము . నా రాముడిని పంపివేసావు ,నా భర్తను చంపేసావు .నాకు కూడా జీవితేచ్ఛ నశించినది . నేనును రాజుగారితో సహగమనము చేసి నా తనువును చాలించెదను" . అని కైకేయిని నిందించుచు ఏడవసాగెను . పరిచారికలు కౌశల్యను అక్కడనుండి ఇవతలకు తీసుకు వచ్చిరి .
మంత్రులు పుత్రులు దగ్గర లేని కారణముగా దశరథ మహారాజుకి అగ్ని సంస్కారాలు చేయుటకు ఇష్టపడక వశిష్టుని ఆజ్ఞ మేరకు దశరధుని శరీరమును తైలద్రోణిలో (నూని తొట్టి )భద్రపరిచి రాజకీయోపచారములు అన్నియు చేసిరి . రాజు శరీరమును తైలద్రోణిలో ఉంచుట చూసిన అంతః పుర స్త్రీలు ఆర్తనాదములు చేస్తూ ఏడవసాగిరి . అక్కడవున్న వారు ,అక్కడకు వచ్చినవారు అందరూ ,నగరంలోని వారు కైకేయిని తిట్టిపోసిరి . ఈ విధముగా మహారాజు మరణముతో అయోధ్యా నగరము శోభను కోల్పోయి తేజోవిహీనమై ఉండెను . చీకట్లు కమ్మెను . రాత్రి అయ్యెను .
రామాయణము అయోధ్యకాండ అరువది ఆరవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment