Saturday 1 October 2016

రామాయణము అయోధ్యకాండ -తొమ్మిదవసర్గ

                                            రామాయణము 

                                     అయోధ్యకాండ -తొమ్మిదవసర్గ 

మంధర దుర్భోధతో కైకేయి మనసు విషపూరితముకాగా కోపముతో వుడికిపోవుతూ "ఈ క్షణమే రాముని వనములకు పంపివేయుదును . భరతుని రాజుగా పట్టాభీష్ఠిక్తుడిని కావించెదను . ఎట్టిపరిస్థితులలో రాజ్యమును రాముడికి దక్కనివ్వను అందుకు ఏదేని ఉపాయమును ఆలోచించమని చెప్పెను . "
అప్పుడు మంధర "దేవీ ! మరచితివా ?పూర్వము దేవదానవ సంగ్రామ సమయములో నీ భర్త దేవతల పక్షమును పోరాడు సమయమున నీ భర్త గాయపడినప్పుడు ,నీవు సారధిగా ఉండి రణరంగము నుండి దూరముగా తీసుకువెళ్లి ఆయన ప్రాణములు కాపాడినందుకు గాను ఆయన నిన్ను రెండు వరముల కోరుకోమన్నాడు . నీవు అవసరము వచ్చినపుడు వాటిని కోరుకుంటాను అన్నావు . కావునా తెలివిగా ఆ వరములు గా భరతుని పట్టాభిషేకము ,రాముని వనవాసమును కోరుకో "అని పలికెను . 
ఇంకనూ ఆ దుష్ట మంధర ఇలా పలికెను "ఓ దేవీ !నీ భర్తకు నీపై కల ప్రేమలో ఏమాత్రము అనుమానము లేదు . ఆ మహారాజు నీ కొరకు అగ్నిలోనైనా దూకును . నీవు కన్నులెర్ర చేసినచో తట్టుకొనజాలడు . నీ తృప్తిని తీర్చుటకు తన ప్రాణములను సైతం లెక్కచేయడు . కావున నీవు ఆరెండు వరములను అడుగు . ఆ వరములా నుండి నిన్ను మరల్చుటకు అనేక విలువైన ఆభరణములు ,రత్నములు మొదలగువాటిని ఆశ చూపును కానీ నీవు వాటికి లొంగవలదు . పదునాలుగేళ్ళు రామును వనవాసమునకు పంపమని అడుగు . ఈలోపు నీ కుమారుడు భరతుడు జనుల అభిమానమును పొందును .కావున ఆలసింపక వెంటనే అలుక వహించు ,నీ కార్యము సిద్దించుకో "అని పలికెను . 
అంత సౌందర్య గర్వముచే విర్రవీగునది ,అందమైన కను తీరుకాలాడి అయినా కైక మంధర తెలివితేటలు మెచ్చుకుని ,భరతుడి పట్టాభిషేకము అనంతరము విలువైన ఆభరణములు కానుకగా ఇస్తానని మాట ఇచ్చి ఆ కుబ్జతో కూడి కోపగృహమునకు చేరెను . అంత కైకా దేవి తన వంటిపై కల విలువైన శ్రేష్టమైన ఆభరణములను తీసివేసెను . నేలపై పరుండెను . అప్పుడు తిరిగి ఆ మంధర "ఓ సుందరీ !రాజ్యాధికారం రామునికి దక్కినచో నీకు నీ కుమారునికి తిప్పలు తప్పవు . కావున భరతుడికి రాజ్యాభిషేకమునకు గట్టిగా పూనుకో "అని రెచ్చకొట్టేను . 
ఈ  విధముగా ఆ కుబ్జ పదేపదే రెచ్చకొట్టగా ఆ రాణి మిగుల వగచెను . తన భర్త తనను వంచించెనని భావించి ఆయనపై మిక్కిలి కోపముగా ఉండెను . ఇంకనూ ఆ కుబ్జ తెలివితేటలకు మెచ్చుకొనెను . పిమ్మట కైక తాన్ అవంతి మీద గల మిగిలిన నగలను కూడా తీసివేసి కఠిన నెల ఫై పరుండెను . ఆ సమయములో ఆమె దివి నుండి భువి పైకి రాలి పడిన కిన్నెర స్త్రీ వలే ఉండెను . 

రామాయణము అయోధ్యకాండ తొమ్మిదవసర్గ సమాప్తము . 

           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 























No comments:

Post a Comment