రామాయణము
అయోధ్యకాండ -పదునేడవసర్గ
ఆకాశమును తాకేటి తెల్లని కాంతులను విరజిమ్ముచున్న మేడలతో ,ఆగారు దూప పరిమళాలతోఁ విశాలమైన అంగళ్ళతో విరాజిల్లుతున్న రాజా వీధిని శ్రీరాముడు చూస్తూ రధము మీద వెళ్ళుచుండెను . ఆ వీధిలో అనేక మంది జనసందోహమును శ్రీరాముడు చూసి వారికి నమస్కరించెను . వారందరూ "ఓ రామా !నీవు పట్టాభిషిక్తుడవై మీ తాతముత్తాతలు వేసిన బాటలో సాగుచూ మమ్ము పరిపాలించు "అని పలికిరి . ఇంకనూ శ్రీరాముడిని అనేక విధములుగా ప్రశంశించిరి . వారి ప్రశంశలు ఇతర గాధలు వినుచు శ్రీరాముడు ముందుకు కదిలెను . శ్రీరాముడు ఆ విధముగా ముందుకు సాగిపోవుచుండగా పురుషులలో ఏ ఒక్కడూ తన మనస్సుని కానీ దృష్టిని కానీ రాముడి మీదనుంచి మరల్చుకోలేకపోయెను . ఇక స్త్రీల విషయము చెప్పనేల ?
ఆ విధముగా ముందుకు సాగి శ్రీరాముడు తన తండ్రి దశరధుడి అంతః పురమునకు సమీపించెను . దేవేంద్రుడి భవనములు వలె వున్న భవనములు సముదాయము కల మూడు కక్షలను రధము మీద దాటెను పిమ్మట పాదాచారియై రెండు కక్షలు దాటెను . పిమ్మట తన వెంట వచ్చిన వారందరిని అచ్చటనే ఆపి శ్రీరాముడు రాజఅంతః పురమున ప్రవేశించెను .
రామాయణము అయోధ్యకాండ పదునేడవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment