రామాయణము
అయోధ్యకాండ -ఇరువదిమూడవసర్గ
శ్రీరాముడు దైవశక్తి ప్రభావము గూర్చి ,ధర్మాచరణ ప్రాముఖ్యము గూర్చి పదే పదే నొక్కి చెపుతుండగా లక్ష్మణుడు వినమ్రుడై వినెను . జరిగిన పరిణామములకు కోపముతో ఊగిపోతూ ,శ్రీరాముని వనవాస నిర్ణయము నుండి తప్పించుటకు అనేక విధములుగా నచ్చచెప్పచూసెను . ఇంకా "అన్నా !దుర్భుద్ధి కల వారిరువురు నీ పట్టాభిషేక నిర్ణయము ప్రకటించాక మునుపే పధకం వేసి వుంటారు . లేకపోతె ఎన్నో ఏళ్ళు క్రితము ఇచ్చిన వారములు ఇన్నీళ్ళు గడిచినా ఇప్పటివరకు ఇవ్వకపోవుట ఏమిటి ?ఆ పధకం ప్రకారమే నిన్ను ఆ వరములను అడ్డము పెట్టుకుని వనవాసమునకు పంపచూచుచున్నారు .
అట్టి దుర్భుద్ధి కలవారి మాటలకు గౌరవము ఇచ్చి నీవు అడవులకు వెళ్ళుట న్యాయము కాదు . మన సూర్యవంశములో రాజులు ,వార్ధక్య సమయములో రాజ్యమును కుమారులకు అప్పగించి ,వారు వానప్రస్థమునకు వెళ్లుదురు . ఇది పూర్తిగా విరుద్ధము . నీవు నన్ను ఆజ్ఞాపింపుము . నన్ను వారి నందరిని ఎదుర్కొని సింహాసము మీద మిమ్ములను కూర్చొబెట్టెదను . అంతే కానీ వనవాసమునకు అంగీకరించలేను . నా మాట వినుము" అనిఅన్నగారిని తన నిర్ణయము మార్చుకోమని ఎన్నో విధములుగా వేడుకొనెను .
లక్ష్మణుడి మాటలు విని రాముడు అతని కన్నీరు తుడిచి ,పెక్కు విధములుగా ఓదార్చి ,అతనితో "నాయనా !లక్ష్మణా !తల్లితండ్రుల ఆజ్ఞను త్రికరణ శుద్ధిగా పాటించువానిగా నన్ను ఎఱుగుము . ఇదియే సత్పురుషుల మార్గము "అని చెప్పెను .
రామాయణము అయోధ్యకాండ ఇరువదిమూడవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment