రామాయణము
అయోధ్యకాండ -ఇరువది అయిదవసర్గ
ఎంతో పరితపించుచు చేసేదిలేక కౌసల్యాదేవి రామునికి పరిపరివిధములుగా ఆశీర్వచనములు ఇచ్చి శుభవచనములు పలికి ,ఋత్వికులను పిలిపించి ,వారిచే హోమము చేసి వారిచే ఆశీర్వచనములు చేయించి ,శ్రీరాముని తదేకదృష్టితో చూస్తూ "నాయనా !క్షేమముగా వెళ్ళిరా !నీ ఈ సుందరనగుమోము చూసినంతనే నా బాధలు తుడిచిపెట్టినట్టుగా తొలగిపోవును . నిన్ను చూడనిదే నాకు ఎంత శుభము కలిగినా అది నాకు సంపూర్ణ సంతోషాన్ని ఇవ్వలేదు . పూర్ణచంద్రుడి వంటి నీ ముఖము చూచు అదృష్టము త్వరగా కలగాలని దేవుళ్ళని వేసుకుంటాను . ఈ పదునాల్గు ఏళ్ళు త్వరత్వరగా గడిచిపోయి నువ్వు మారాలి వచ్చు రోజు త్వరగా రావలెనని వేసుకుంటాను "అని పలికి రాముడు వనవాసమునకు అనుమతి ఇచ్చెను .
ఆ విధముగా పలికి అశ్రుపూర్ణలోచనయై ,విధ్యుక్తముగా స్వస్తి వాచక కార్యక్రమములు పూర్తిచేసెను . పదేపదే తనయుని హృదయమునకు హత్తుకొనెను . అప్పుడు శ్రీరాముడు నిండు భక్తితో తల్లిచరణములకు నమస్కరించెను . తల్లికి వీడ్కోలు పలికి సీతాదేవి మందిరమునకు బయలుదేరెను .
రామాయణము అయోధ్యకాండ ఇరువది అయిదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు .
No comments:
Post a Comment