రామాయణము
అయోధ్యకాండ -ఇరువదిరెండవసర్గ
రాముడి పట్టాభిషేక అవాంతరం తో లక్ష్మణుడు అశాంతితో ,అసహనంతో ఊగిపోవుతూ ఉండెను . అప్పుడు రాముడు "సోదరా !లక్ష్మణా !నా కారణముగా తండ్రి మీద కలిగిన రోషమును విడనాడుము . జరిగిన సంఘటనలను అవమానంగా భావించకు . ఇదివరకు లానే తండ్రిగారిని గౌరవించుచు ,వారికి సేవలు చేయుము . ఇంతవరకు నా పట్టాభిషేకము కోసము ఎంత ఉత్సాహముతో కావలిసిన సామగ్రి సమకూర్చావో ,అంతే ఉత్సాహముగా నా వనవాసమునకు ఏర్పాట్లు చేయుము . బుద్ధిపూర్వకంగా కానీ తెలియక కానీ తల్లుల్లో ఏ ఒక్కరికి కానీ తండ్రిగారికి కానీ రవ్వంత భాద కలగనీయకూడదు అనేది నా కోరిక . కావున వెనువెంటనే వనవాసమునకు వెళ్లవలెనని నిర్ణయించుకొన్నాను . కావున ఆ ఏర్పాట్లు త్వరితగతిన చేయుము . తల్లి కైక మీద కోపము చూపకు . పెద్దపెద్ద ధర్మజ్ఞులు ,మునులు సైతము ఒక్కొక్కసారి చిత్తచoచలత్వము పొందెదరు .ఆమె విధి ప్రేరణ వలననే ఆవిధముగా మాట్లాడినది . కావున ఆమెపై ఆగ్రహము తగదు . "అని తమ్ముడిని అనునయించెను .
రామాయణము అయోధ్యకాండ ఇరువదిరెండవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment