రామాయణము
అయోధ్యకాండ -పదునొకొండవసర్గ
అంత ఆ కైక "ఓ దేవా !నన్నెవరు అవమానించలేదు . నాకొకకోరిక వుంది దానిని మేరె తీర్చాలి . అలా తీరుస్తానని మాట ఇస్తే నాకోరిక ఏమిటో తెలుపుతాను "అని పలికెను . అంత దశరధుడు ఆమె శిరస్సుని తన వడిలో చేర్చుకుని ,తన చేతితో ఆమె ముంగురులు సవరించుచు "దేవి నా భార్యలందరిలో నీవే నాకు అత్యంత ప్రియమైనదానవు . నీకోరిక ఏదయినను నేను తప్పక తీర్చెదను దానికై నా ప్రాణములు సైతము విడుచుటకు సిద్దము నా ప్రాణమైన రాముడి మీద ప్రమాణము చేసి చెబుతున్నాను . నీ కోరిక ఏమిటో తెలుపుము "అని ఎంతో అనునయముగా అడిగెను .
మహారాజు మాటలకు వచ్చిన ధైర్యముతో కైక "రాముడి మీద నీ పుణ్యము మీద ప్రమాణము చేసి నా కోరిక తీరుస్తానని మాట ఇచ్చావు . దీనికి ముక్కోటి దేవతలు సాక్షులు . ఓ దేవా ఆనాడు దేవాసుర సంగ్రామ సమయములో నీవు ఇచ్చిన రెండు వరములను ఇప్పుడు నేను కోరుకోదలిచాను . ఆ వరములు నాకు ఇవ్వనిచో నేను ఈ క్షణమే ప్రాణము లు వదిలేస్తాను .
ఆ వారములు ఏమనగా ,శ్రీరాముని కొరకై ఏర్పాటు చేసిన సామగ్రితో ,సన్నాహాలతో నేడే నా భరతుడిని యువరాజుగా పట్టాభిషిక్తుని చెయ్యాలి . ఇది నా మొదటి వరము .
శ్రీరాముడు నారా చీరలు జింక చర్మము ధరించి ,జటాధారియై ,దండకారణ్యమునకు వెళ్లి పదునాలుగు సంవత్సరములు తాపస వృత్తిలో నివసింపవలెను . ఇది నా రెండవ వరము .
రాజులకే రాజువైన నీవు నీ ప్రతిజ్ఞలు కట్టుబడి నీవిచ్చిన వాగ్ధానమును నిలబెట్టుకో "అని కైక ఎంతో పాశాం ఆహృదయముతో పలికెను .
రామాయణము అయోధ్యకాండ పదకొండవసర్గ సమాప్తము .
శశి .
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment