Friday 7 October 2016

రామాయణము అయోధ్యకాండ -పదుమూడవసర్గ

                        రామాయణము 

            అయోధ్యకాండ -పదుమూడవసర్గ 

ఆ విధముగా పరితపించుచు దుఃఖముతో విలవిలలాడుతున్న దశరధుని ఏమాత్రము పట్టించుకొనక కైక "ఓ మహారాజా ! నేను సత్యవాదిని ,దృఢవ్రతుని అని గొప్పలు చెప్పుకుంటివే ?కానీ నీవు వాగ్దానము చేసిన విధముగా నా వరములు ఇచ్చుటకు ఎలా వెనకాడుచుంటివి "అని నిష్ఠురముగా పలికెను . 
ఆ కఠోర మాటలు విని దశరథ మహారాజు క్షణకాలం మూర్చితుడయ్యి ,పిదప తేరుకుని కోపముతో "నరోత్తముడైన రాముడు వనములకు వెళ్ళగానే నా ప్రాణములు పోవుట తధ్యము . నేను స్వర్గస్తుడైనచో అచ్చట దేవతలు సైతము శ్రీరాముని క్షేమ సమాచారములు గూర్చి అడుగుతూ స్త్రీ మూలముగా సద్గునవంతుడైన శ్రీరాముని అడవులకు పంపిన మూఢుడవు అని నన్ను నిందించినచో ఆ మాటలకు ఎట్లు తట్టుకోగలను ?
అదియును కాక సభలో నేను శ్రీరాముని పట్టాభిషిక్తుడిని చేసెదను . అని నేను చేసిన ప్రకటన కల్లకాదా ?చాలా కాలము పుత్రులు లేని నాకు పెక్కు  యజ్ఞ యాగాదులు ఫలితముగా ,ఆజానుబాహుడు ,మహాత్ముడు అయిన శ్రీ రాముడు నాకు పుత్రుడుగా లభించెను . ఆ చిన్నారిని చూడకుండా నేను ఎలా ఉండగలను . 
అని పరిపరి విధములుగా పరితపించి ,తనలో తానూ ఓ రాత్రి తెల్లవారకుండా ఇలానే ఉండిపో ,నా రాముని నాకు దూరము చేయవద్దు అనుకొనెను . ఇంకనూ కైకను ఒప్పించుటకు శతవిధములుగా ప్రయత్నించి విఫలుడయ్యెను . మనస్సునే కుమిలిపోవుచు వున్న ఆ దశరధుడికి ఆ రాత్రి ఏట్లో గడిచెను . వేకువజామున రాజును మేల్కొల్పుటకు శంఖపటహవీణారావములు ,వైతాళికులు బహుపరాకులు మొదలుకాగా ఆ దశరథ మహారాజు వాటిని నివారించెను . 

రామాయణము అయోధ్యకాండ పదుమూడవ సర్గ సమాప్తము . 

           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  









No comments:

Post a Comment