రామాయణము
అయోధ్యకాండ -ఇరువదిఆరవసర్గ
శ్రీరాముడు తల్లి కౌశల్యాదేవి మంగళాశీస్సులు శ్వీకరించి ,ఆమెకు ప్రణమిల్లి ,వనవాస నిమిత్తమై అచ్చటనుండి బయలుదేరి కిక్కిరిసియున్న రాజవీధులోకి అడుగుపేట్టేను . అక్కడి జనమంతా విచిత్ర పరిస్థితి (పట్టాభిషేక హంగామా ఏమి లేకుండా సాధారణముగా ) వున్న రాముని చూసి పరిస్థితి అర్ధము కాక ఆ ప్రజల హృదయములు మిగుల మధనపడెను .
శ్రీరాముడు సీతాదేవి అంతఃపురము వైపు సాగిపోయెను . ఈ విషయములు ఏమి తెలియని సీతాదేవి పట్టాభిషేక మహోత్సవము పురస్కరించుకొని తాను చేయవలసిన కర్తవ్యములు నిర్వర్తించుచు శ్రద్ధతో దైవ పూజలు పూర్తిచేసెను . అనంతరము భర్త కోసము సంతోషముతో ఎదురుచూస్తుండెను . ఆ భవనము అంతా శోభాయమానంగా అలంకరించబడెను . అక్కడివారందరి ముఖము సంతోషముతో వెలిగిపోవుచుండెను . ఆ సమయములో అక్కడకు విచ్చేసిన రాముని ముఖము మాత్రము చింతతో ఉండెను .
శ్రీరాముని ఆవిధముగా చూసిన సీతాదేవి మనసు బాధతో విలవిలలాడెను . ఆయన విచారము చూసి కకావికలమవుతున్న సీతాదేవితో విషయము ఎలా చెప్పాలా?అని రాముడు ఆలోచించసాగెను . పదేపదే ఏమయినది ?ఎందుకిలా వున్నారు ?అని అడుగుతున్న సీతా దేవితో రాముడు అసలు విషయము చెప్పి ,తానూ వనవాసముకు వెళ్లిన సమయములో సీతాదేవి ఏ విధముగా నడుచుకోవలెనో పరిపరి విధములుగా చెప్పెను . అందరితో అభిమానంతో ,అత్తమామల పట్ల గౌరవముతో ,ప్రతి ఒక్కరితో మంచిగా ఉండమని ,జాగ్రత్తగా మసులుకోమని చెప్పెను .
రామాయణము అయోధ్యకాండ ఇరువదిఆరవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment