Sunday 16 October 2016

రామాయణము అయోధ్యకాండ -ఇరువదియవసర్గ

                               రామాయణము 

                      అయోధ్యకాండ -ఇరువదియవసర్గ 

నరశ్రేష్టుడైన రాముడు తండ్రికి నమస్కరించి ,ఆ అంతఃపుర భావనమును వదిలి బయటకు రాగా ఆ భవనము నందలి మిగిలిన రాణులు ,దాసీలు పెద్దపెట్టున ఎడ్వనారంభించిరి . "ఎవ్వరు చెప్పకున్నను రాముడు మన బాగోగులు ఏంటో చక్కగా చూసాడు . ఇప్పుడు చిన్న వయసులో వనములకు వెళ్లి ,కష్టములననుభవించనున్నాడు "అంటూ పెద్దగా ఏడవసాగిరి . ఆ ఆర్తనాదములు విని దశరధుడి భాద మరింత అధికమాయెను . రాముడు కౌశల్యా దేవి భవనము వైపు సాగెను . భవనము నందలి కక్షలలో వృద్ధ బ్రాహ్మణ పండితులను ,వృద్ధ ముత్తయిదువులు చూసేను . వారంతా రాముని చూసి జయజయద్వానములు చేసిరి . రాముడు కౌశల్యాదేవి అంతః పురములోకి ప్రవేశించేసరికి కౌశల్య ముందు రోజు రాత్రి నుండి ఉపవాసము చేసి వ్రాత దీక్షలో ఉండి యాగ కార్యక్రములో నిమగ్నమైవుండెను . 
రాముడిని చూసి మిక్కిలి సంతోషముతో ఎదురువచ్చి నుదిటి మీద ముద్దు పెట్టి రాముడిని దగ్గర కు తీసుకుని ఆశీర్వచనములతో ముంచెత్తేను . అప్పుడు రాముడు తల్లికి పాదాభివందనం చేసి తన వనవాస వృత్తాoతమును తెలపగా ఆమె ఒక్కసారిగా ఆకాశము నుండి నేలపై పడిన కిన్నెరా స్త్రీ వలె నేలపై పడిపోయెను . అప్పుడు శ్రీరాముడు తల్లిని లేవనెత్తి శుశ్రూషలు చేసెను . అప్పుడు కౌశల్య మిక్కిలి దుఃఖముతో "నాయనా రామా !నా కంటి వెలుగువు నీవు . నిన్ను ఎన్నో నోముల ఫలముగా కని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాను . నిన్ను అందరూ ప్రశంశిస్తుంటే మురిసిపోయాను . ఇంతవరకు  సవతుల సూటిపోటిమాటల వల్ల మనసుకి ఎంత భాధ కలిగినా ,నీ తండ్రి దశరధుడు ఆ కైకేయి దాసీ కన్నా కూడా నన్ను తక్కువుగా చూసినా నేను నిన్ను చూసుకుని వాటినన్నిటిని భరించాను . ఇక మీదట ఏ ఆశతో బతకను . వాటిని ఎలా భరించను . నీకు దూరమై నేను జీవించుట వృధా . "అంటూ బోరున విలపించెను . 

రామాయణము అయోధ్యకాండ ఇరువదియవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




















No comments:

Post a Comment