Friday 28 October 2016

రామాయణము అయోధ్యకాండ -------ఇరువదితొమ్మిదవసర్గ

                                         రామాయణము 



                              అయోధ్యకాండ -------ఇరువదితొమ్మిదవసర్గ 

ఇట్లు రామచంద్రుడు పలికిన సాంత్వవచనములు విని .సీతాదేవి మిగుల దుఃఖిత అయి కన్నీరు కార్చుచు "నాధా !వనములలో పెక్కు కష్టములు కలవు . నిజమే కానీ మీ సాహచర్యప్రభావమున అవన్నియు నాకు సుఖములు ,సంతోషములు అగును . వాటన్నిటిని మీ కృపతో నేను అవలీలగా అధిగమింతును . ప్రభూ !మాతండ్రి జనకుడు కన్యాదాన సమయమున నన్ను మీకు సహధర్మచారిగా అప్పగించారు . కనుక నేను కూడా మీతో వనములకు వచ్చుటే ధర్మము . అంతే కాదు నేను మా తండ్రి గారి గృహమున ఉండగా దైవజ్ఞులైన బ్రాహ్మణోత్తములు ,ఒక భిక్షకుడు నేను వనములకు వెళ్తానని చెప్పివున్నారు . బ్రాహ్మణులకు వాక్యము తధ్యము . కనుక నేను మీతో వనములకు వచ్చుచున్నాను . 
ఓ పుణ్యాత్మా !మిమ్ములను ప్రేమాదరములతో  అనుసరించుచు సేవించుచుండుట వలన నా దోషములన్నీ తొలగి పవిత్రురాలిని అగుదును . పతియే నాకు ప్రత్యక్షదైవం . దుఃఖిత  అయి ఇంతగా ప్రాధేయపడుతున్న నన్ను మీ వెంట తీసుకుని పోవుటకు సమ్మతించనిచో నేను విషము త్రాగి కానీ ,అగ్నిలో ప్రవేశించికాని ,నీట మునిగి కానీ మృత్యుదేవత వాడి చేరెదను . "అని పలుకుతున్న సీతా దేవి ని వనవాస నిర్ణయము నుండి మరల్చుటకు ప్రత్నించుచు ఆమెను శ్రీ రాముడు ఓదార్చెను . 

రామాయణము అయోధ్యకాండ ఇరువదితొమ్మిదవసర్గ సమాప్తము . 


             శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment