Saturday 15 October 2016

రామాయణము అయోధ్యకాండ -పందొమ్మిదవసర్గ

                        రామాయణము 



                       అయోధ్యకాండ -పందొమ్మిదవసర్గ 

 కైక మాట్లాడిన మాటలు విని రాముడు ఏమాత్రము వ్యధ చెందక ఆమెతో "అమ్మా !నీవు చెప్పినట్లే చేయుదును . రాజాజ్ఞను శిరసావహించుచు  ఈ అయోధ్యా నగరమును విడిచి ,జటా వల్కలధారినై వనవాసమునకు వెళ్లెదను . సోదరుడు భరతుడు కొరకై నేను రాజ్యమునే కాదు అత్యంత ప్రీతికరములైన ప్రాణములను ,సంపదలను సైతము ఇచ్చివేయుదును . కనుక ఈయనను ఓదార్చుము . అయ్యో !ఇదియేమి ?మహారాజు నేలపై చూచుచు తిన్నగా కన్నీరు కార్చుచున్నాడు ." 
కైక రాముని వనవాసమునికి వెళ్ళమని తొందరపెట్టెను . రాముడు దశరధుడు తనతో మాట్లాడటలేదని బాధపడెను . "అమ్మా !మా తండ్రి నన్ను ఆజ్ఞాపింకకున్నను మీరు చెప్పినారు కదా !అదే చాలు నేను నిర్జన ప్రదేశములో 14 సంవత్సరములు తప్పక నివసించెదను . అమ్మా !కౌశల్యా మాత వద్ద సెలవు తీసుకుని సీతను అనునయించి వచ్చెదను . నాకు ఆ గడువు మాత్రము ఇమ్ము అనంతరము నేను దండకారణ్యమునకు వెళ్లెదను . "అని పలికెను . 
ఆ మాటలు విని దశరధుడు మిక్కిలి దుఃఖమున మునిగిపోయెను . శోక భారముచే కన్నీరు కార్చుచు ,ఏమియు మాట్లాడలేక వెక్కి వెక్కి ఏడ్చెను . మహా తేజశ్వి అయినా రాముడు స్పుహ కోల్పోయి ఉన్న దశరధుడి పాదములకు నమస్కరించి ,కైక పాదములకు నమస్కరించి భవనము బయటకు వచ్చెను . అక్కడ జరిగిన పరిణామమునకు క్రుద్ధుడైన లక్ష్మణుడు రాముడిని అనుసరించెను . రథములను ,గజములను ,మిత్రులను పంపివేసి కౌశల్యా దేవికి అరణ్యవాస విషయము చెప్పుటకై ఆమె భవనము వైపు కదిలెను . 

రామాయణము అయోధ్యకాండ పందొమ్మిదవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

                     

   

No comments:

Post a Comment