Friday 5 April 2019

రామాయణము సుందరకాండ పదునెనిమిదవసర్గ

                              రామాయణము 

                          సుందరకాండ పదునెనిమిదవసర్గ 

అంజనీ సుతుడైన హనుమంతుడు అశోకవృక్షముపై కూర్చుని సీతాదేవి గురించి ఆలోచిస్తుండగా , వేకువ జాము అయినది . ఆ సమయములో ఆ లంకలో వేదం ఘోష వినపడెను . చక్కటి మంగళ వాయిద్యములతో లంకాప్రభువైన రావణుని అతని అనుచరులు నిద్రలేపిరి . అలా నిద్రలేచిన రావణుడు అనేకమంది సుందర స్త్రీలు  సుగంధ తైలములతో వెలిగించబడిన బంగారు కాగడాలను పట్టుకుని ముందు నడుస్తుండగా ,ఎదురుగా బంగారుకలశము పట్టుకొని ఒక అందమైన యువతి నడుస్తుండగా ,రావణుడు అశోకవనములోకి ప్రవేశించెను . ఆయన పక్కన బంగారు మధిరపాత్ర పట్టుకుని ఒక స్త్రీ నడుస్తోంది . చక్కటి వింజామరలు పట్టుకుని విసురుతూ అనేకమంది స్త్రీలు ఆయనను అనుసరిస్తున్నారు . ఇంకా అనేకమంది స్త్రీల సమూహము రావణుని అనుసరిస్తుండగా రావణుడు సీతాదేవిని చూడవలెననే కాంక్షతో అశోకవనములోకి వచ్చెను . 

రామాయణము సుందరకాండ పదునెనిమిదవసర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment