Monday 29 April 2019

రామాయణము సుందరకాండ - ముప్పది ఏడవసర్గ

                                  రామాయణము 

                                   సుందరకాండ - ముప్పది ఏడవసర్గ 

అంజనీసుతుడైన హనుమ మాటలు విన్న సీత "ఓ  వానరోత్తమా !విధివశము ఇదేకదా చక్కగా అంతః పురములో రాజుస్సుఖములు అనుభవించవలసి న వాళ్లమైన రామలక్ష్మణులు నేను అరణ్యములోకి వనవాస నిమిత్తము ప్రవేశించాము అక్కడ బానే వున్నాము అనుకునేలోపల రాక్షసుడి చేత అపహరించబడి ఈ రాక్షస చెరలోకి చేరి యాతన పడుతున్నాను . అధముడైన రావణుడు నాకు ఒక సంవత్సరకాలం గడువు విధించెను . ఇప్పుడు పడవనేల గడుచుచున్నది ఇంకా రేడు నెలలు మాత్రమే మిగిలి ఉన్నది . ఈ గడువు వరకే నేను ప్రాణములతో వుంటాను . కావున త్వరగా నా వద్దకు వచ్చి నన్ను రక్షించమని చెప్పు "అని పలికెను . 
అప్పుడు హనుమ "అమ్మా !శ్రీరాముడు నా మాట వినినంతనే కోట్లాదిగా కల వానరభల్లూక సేనలతో కూడి ఇక్కడకు శీఘ్రముగా రాగలడు . అంతదాకా ఎందుకు ?ఇప్పుడే నేను నిన్ను తీసుకువెళ్లి ,నీ దర్శనము కోసము వేచి చూస్తున్న శ్రీరాముని వద్దకు నిన్ను చేర్చగలను . నేను తలచుకుంటే దుష్టుడైన రావణాసురిడితో సహా ఈ లంకా నాగరిని మొత్తము ఎత్తుకెత్తి నా ప్రభువు శ్రీరాముని కాళ్ల దగ్గర పడవేయగలను . మిమ్ము భుజములపై ఎక్కించుకుని శ్రీరాముని చెంతకు చేర్చుతాను . నేను వేగముగా ఎగురునపుడు నన్ను అందుకొనుట ఎవరితరమూ కాదు . అగ్నిదేవుడు హవ్యమును మోసుకుపోవునట్లు నేను మిమ్ము మోసుకుపోగలను " అని పలికెను . 
ఆ మాటలు విన్న సీతాదేవి "ఓ వానరోత్తమా నేవే చిన్నగా వున్నావు . నీకంటే పెద్దగా వున్న నన్ను ఎలా మోసుకుపోగలవు ?అని అడిగెను . అది తనకు అవమానంగా భావించిన హనుమ వెంటనే తన దేహమును పెంచి తన బృహద్రూపమును సీతామాతకు చూపించెను . అప్పుడు సీతాదేవి "ఓ వానరోత్తమా !నీవు సముద్రమును లంఘించి వచ్చినావని తెలిసినపుడే నీ శక్తి సామర్ధ్యములను అంచనా వేసాను . ఇప్పుడు నీ ఈ రూపము చూసిన పిమ్మట నాకు ఇంకా నమ్మకము కలిగినది . నన్ను బలవంతముగా తీసుకువచ్చిన ఈరాక్షసుడికి తగిన బుడ్డి చెప్పి నా ప్రభువే నన్ను గౌరవంగా తీసుకువెళ్లవలెను . అదే నాకు మర్యాద ఆయన శక్తిసామర్ధ్యములకు మర్యాద . అదీకాక నేను పతివ్రతము నా భర్తను తప్ప మారె పర పురుషుడిని తాకనే తాకను . ఈ రావణుడు నన్ను బలవంతముగా తీసుకుని వచ్చినప్పుడు అతడి శరీర స్పర్శ నాకు తగిలినది కాని అది నేను కావాలని చేసినది కాదు . పైగా అప్పుడు నేను అశక్తురాలను . ఆ దుష్ట రావణునికి బదులు చెప్పి నా స్వామి నన్ను అతి త్వరలోనే తీసుకువెళ్లును ఇది నా పరిపూర్ణవిశ్వాసము . ఆ విశ్వాసము వల్లనే నేను ప్రాణములతో వున్నాను . మృత్యుదేవత రావణునికి అతి సమీపములో వున్నది . ఇది నిజము . "అని పలికెను . 

రామాయణము సుందరకాండ ముప్పదియేడవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







No comments:

Post a Comment