రామాయణము
సుందరకాండ -నలుబదిఒకటవసర్గ
సీతాదేవిని దర్శించుట అనే ముఖ్యకారణము ముగిసినది ,ఇంకనూ చేయవలసిన కార్యమేమి అని హనుమ ఆలోచించసాగెను . సామదానబేధదండోపాయములలో మొదటి మూడిటితో ఇక్కడ పనిలేదు కావున ఆఖరిది ఐన దండోపాయము ప్రయోగించి రావణుని బలము తెలుసుకోవాలని హనుమ భావించెను . చెప్పిన పనిని చక్కగా పూర్తిచేయుటే కాక దానిని సంభందించిన ఇతర పనులను కూడా చేయువాడే సమర్ధుడు . కావున ఇప్పుడు నేను ఈ లంకా నగరములో కల రాక్షసుల బలములు, యుద్ధ నైపుణ్యములు ,మంత్రులను తెలుసుకుని సుగ్రీవుడి వద్దకు వెళ్ళినచో యుద్ధ ప్రణాళిక వేయుటకు అనువుగా ఉండునని ఆలోచించెను .
వీరికి యుద్ధమునకు రెచ్చగొట్టుటకు తగిన ఉపాయమేదని అలోచించి ,తానూ వున్న ఆ సుందరమైన అశోకవనమును ధ్వంశము చేయుట ద్వారా వారిని రెచ్చకొట్టవచ్చునని ,తద్వారా తనను ఆపుటకు వచ్చిన రాక్షసులందరినీ తుడా ముట్టించి సుగ్రీవుడి వద్దకు వెళ్లవలెనని నిర్ణయించుకొనెను . పిమ్మట అక్కడ బాగుగా పుష్పించి చక్కగా ఉన్న చెట్లను పీకివేయుట ,వాటి కొమ్మలను విరుచుట ,విరిచిన వాటిని మిగిలిన వాటి మీద విసిరికొట్టుట మొదలగు పనులు చేస్తూ రాక్షసులకోసము ఎదురుచూడసాగెను .
రామాయణము సుందరకాండ నలుబదిఒకటవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment