Thursday 18 April 2019

రామాయణము సుందరకాండ -ముప్పదిమూడవసర్గ

                                         రామాయణము 

                                          సుందరకాండ -ముప్పదిమూడవసర్గ 

సీతాదేవి తనను చూసిన పిమ్మట హనుమ నెమ్మిదిగా ఆ అశోకవృక్షము దిగి సీతాదేవికి ఎదురుగా వచ్చి నిలబడెను . ఆ సమయములో రాత్రంతా కాపలా కాసిన రాక్షస స్త్రీలు అల్సటచే ఎక్కడివారక్కడ నిద్రపోయిరి . అప్పుడు హనుమ సీతాదేవితో "అమ్మా !ఓ దివ్య మంగళ రూపినీ !నీవు ఎవరు ?నువ్వు చూచుటకు రాజవంశపు స్త్రీ వలె ఉన్నావు . నేను శ్రీరాముని ధర్మపత్ని ఐన సీతాదేవిని వెతుకుతూ ఇచటికి వచ్చాను . మా దైవము రామచంద్రుడు చెప్పిన పోలికలు నీలో కనిపించుచున్నవి . నీకు భద్రమగుగాక . తల్లీ !దయచేసి మీరెవరో చెప్పండి "అని పలికెను . 

ఆ మాటలు విన్న సీతాదేవి "ఓ వానరా !నేను జనకుని కుమార్తెను ,దశరధుని పెద్దకోడలిని ,నన్ను సీత అంటారు . మా వివాహమైన పిదప అయోధ్యలో సంతోషముగా 12 సంవత్సరాలు వున్నాను 13 వ సంవత్సరము మా మామగారు దశరథ మహారాజు నా భర్త శ్రీరామునికి యువరాజుగా పట్టాభిషేకము చేయుటకు యత్నించెను . కానీ మా మహారాజు చిన్న భార్య కైకేయికి ఇచ్చిన వరముల కారణముగా నా భర్త వనవాసము చేయుటకు వనములకు వెళ్ళుటకు సిద్దపడెను . నేనునూ ఆయనతో వనములకు పయనమయ్యాను . ఆయన సోదరుడు లక్ష్మణుడు కూడా మాతో వనములకు వచ్చాడు . మేము దండకారణ్యములో వున్న సమయములో రావణుడు నన్నుఅపహరించాడు 
 . ఆ దుష్టుడు నాకు రెండు నెలల గడువును విధించాడు . ఆ గడువు పూర్తయిన పిదప నేను ప్రాణములతో  ఉండను .  "అని పలికెను . 

రామాయణము సుందరకాండ ముప్పదిమూడవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment