రామాయణము
సుందరకాండ -ఇరువది అయిదవసర్గ
ఆ అశోకవనంలో సీతాదేవికి కాపలావున్న రాక్షసస్త్రీలు సీతాదేవిని పలువిధములుగా తమ మాటలచేత ,చేష్టలచేత భయపెడుతుండగా ఆ మాత శోకమూర్తిలా ఏడ్చుచూ ,భయముతో వణికిపోసాగెను . అయినను ఆ రాక్షస స్త్రీలతో "మీరు కోరుకున్నట్టుగానే నన్ను తినేయండి . నేను మాత్రము మీరు చేపినది చేయను ". అని పలికెను .
ఆ విధముగా పలికి తన స్థితి తలచుకుని దుఃఖించెను . "అయ్యో ఎప్పుడు ఏ పాపము చేసానో నాకీవిధమైన దుస్థితి లభించినది . హా రామా !హా లక్ష్మణా !,అయ్యో కౌసల్యా మాతా !అయ్యో సుమిత్రా మాతా !"అని రోదించెను . "రాముడికి దూరమైనను నేను బతికి ఎలా వున్నాను . ఈ రాక్షస స్త్రీల కాపలా నుండి తప్పించుకుని నా రాముడిని నేను చేరలేను . బహుశా ఈ జన్మలో శ్రీరాముని దర్శనభాగ్యము నాకు కలుగునో లేదో ?ఇక ఈ జన్మ జీవించి ఏమి ప్రయోజనము ?జీవించుట కంటే మరణించుటే ఉత్తమము . కానీ పెద్దలు ఆత్మహత్య మహాపాపము అని చెబుతారు . అదీకాక నేను రాముని అర్ధాంగిని ఆయన అనుమతి లేకుండా మరణించుట సరికాదు . కావున చావు వచ్చు వరకు జీవించవలసినదే . జీవించినతవరకు రాముని తలుచుకుని కాలము గడపవలెను . "అని తనలో తానూ అనుకొనెను .
రామాయణము సుందరకాండ ఇరువదియైదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment