రామాయణము
సుందరకాండ -ముప్పదియైదవసర్గ
హనుమంతుడి మాటలు విన్న సీతాదేవి హనుమతో "ఓ వానరా ! నిజముగా శ్రీరాముని దూతవే అయితే ఆయన గుణగణాలను వర్ణించు ,శ్రీరామునికి సుగ్రీవునికి స్నేహము ఎలా కుదిరినదో నాకు వివరముగా చెప్పుము . "అని పలికెను . అప్పుడు మారుతి
శ్రీరాముని రూప లావణ్యమును ,అందచందములను చక్కగా వివరించెను . ఇంకా శ్రీరామునికి సుగ్రీవునికి మైత్రి కలిగిన విధానమును కూడా వర్ణించెను . ఇంకా "ఓ మాతా !ఒకనాడు నేను ,మా ప్రభువైన సుగ్రీవుడు ఇంకా కొంత మంది వానరప్రముఖులు కలిసి ఋష్యమూక పర్వతముపై కూర్చుని ఉండగా ఒక ఉత్తరీయములో కట్టబడిన నగల మూట మా మధ్యలో పడెను . తలా పైకెత్తి చూడగా ఒక రాక్షసుడు సుందర రూపము కల స్త్రీని అపహరించుకు పోతున్నాడు . ఆ నగల మూటను మా ప్రభువైన సుగ్రీవుడు జాగ్రత్తపరిచేను . తదుపరి కొంతకాలమునకు శ్రీరామచంద్రప్రభువు మిమ్ములను వెతుకుతూ వచ్చినపుడు మేము ఆ నగల మూటను ఆయనకు చూపినాము . అప్పుడు ఆ ప్రభువు ఆ నగలను చూసి వాటిని గుర్తించి వెంటనే స్పృహ తప్పి పడిపోయెను . అప్పుడు నేనే ఆయనను అతి కష్టము మీద లేవదీసి కూర్చుండపెట్టితిని . ఆయనను ఊరడించుట చాలా కష్టమైనది "అని తదితర విషయములన్నిటిని వివరముగా చెప్పెను .
పిదప "ఓ మైథిలీ !విషయములన్నీ సవివరముగా నీకు వివరించాను . నీవు ఊరడిల్లినట్లయితే నేను వెళ్తాను . "అని పలికెను .
రామాయణము సుందరకాండ ముప్పదియైదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment