రామాయణము
సుందరకాండ -పంతొమ్మిదవసర్గ
ఆ విధముగా అనేకమంది స్త్రీలు రావణుని వెంట రాగా రావణుడుఅశోకవనములో సీతాదేవి వున్న ప్రదేశమునకు వచ్చెను . అలా వచ్చిన రావణుని చూసిన సీతాదేవి ముడుచుకుని దుఖిస్తూ కూర్చుని ఉండెను . అప్పుడు సీతాదేవి నీళ్లలోనుండి బయటకు తీయుట వలన వాడిన తామర తీగ వలె వున్నది . ఎటువంటి అలంకారములు లేకున్నను ,స్నానాది సంస్కారములు చేయకున్నను ,తైలము రాయకపోవుటచే జుట్టు అట్టలుకట్టి ఉన్నను ,ఆమె సుందరముగానే వున్నది . ఆ క్షణములో ఆమె చూపులు శ్రీరాముడి చేతిలో ఏ నాటికైనను ఈ రావణునికి చావు తప్పదన్నట్టు ఉండెను .
రామాయణము సుందరకాండ పంతొమ్మిదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment