రామాయణము
సుందరకాండ -ముప్పదిరెండవసర్గ
శ్రీరాముని కథాగానము విని అశోకవృక్షముపై కూర్చుని వున్న హనుమను చూసి సీతాదేవి ఒక్క నిమిషము స్పృహ కోల్పోయెను . స్పృహలోకి వచ్చిన వెంటనే తాను చూసినది ,విన్నది కల అని బ్రమించెను . "కలలోకి వానరం వచ్చుట అనర్థదాయకం అని పెద్దలు అంటారు . ఈ కల యొక్క చెడు ప్రభావము ,రామలక్ష్మణుల మీద ,నా తండ్రి జనక మహారాజు మీద,కౌసల్య సుమిత్రా మాతల మీద లేకుండెను కాక . "అని ఆలోచించెను . పిమ్మట "లేదు లేదు నేను ఆ వానరుడిని కళ్లారా చూసాను . అతడు శ్రీరాముడి కథాగానము చేసాడు . ఇది నిజాము అవ్వాలి . "అని దేవతలందరినీ తలుచుకొని ప్రార్ధించెను .
రామాయణము సుందరకాండ ముప్పదిరెండవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు .
No comments:
Post a Comment