రామాయణము
సుందరకాండ -ఇరువదియెనిమిదవసర్గ
త్రిజట తన కల గురించి చెప్పినను ,సీతాదేవి ధైర్యము రాకుండెను . సీతాదేవి తన దీన స్థితిని తలచుకుని మిక్కిలి చింతించెను . అదీకాక రావణుని మాటలను ,రక్కసి మూకల బెదిరింపులను పదే పదే జ్ఞప్తికి తెచ్చుకుని చింతించసాగెను . శ్రీరాముడు ఇంకా తనను కాపాడుటకు రాలేదని బాధపడెను . వస్తాడోరాడో అని సందేహపడెను . రక్కసి మూకల బెదిరింపుల మధ్య ప్రతి రోజూ చస్తూ బతకడం కన్నా ,ఒకేసారి చనిపోవుట ఉత్తమమని భావించెను . విషము త్రాగి కానీ ,ఆయుధముతో పొడుచుకుని కానీ చనిపోవాలని అనుకొనెను . కానీ ఈ లంకలో ఎవరు తనకు విషము కానీ ఆయుధము కానీ తెచ్చి ఇవ్వరని అనుకొనెను . చివరికి తన జుట్టుతో చెట్టుకి ఉరిపోసుకుని చనిపోవాలని నిర్ణయానికి వచ్చెను . సీతాదేవి కూర్చున్న చోటు నుండి లేచి బాగుగా పుష్పించిన అశోక వృక్షము వద్దకు చనిపోవుటకు వెళ్లెను .
రామాయణము సుందరకాండ ఇరువదియెనిమిదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment