Saturday 13 April 2019

రామాయణము సుందరకాండ -ఇరువదితొమ్మిదవసర్గ

                                   రామాయణము 

                            సుందరకాండ -ఇరువదితొమ్మిదవసర్గ 

ఆ విధముగా ప్రాణత్యాగము కొఱకు అశోకవృక్షము వద్దకు వెళ్లిన సీతాదేవికి శుభ శకునములు కనిపించసాగినవి (ఎడమకన్ను అదురుట ,ఎడమ భుజము అదురుట మొదలయినవి ). విజ్ఞానవంతురాలు ఐన సీతాదేవి ,తనకు కలిగే శుభ శకునములు గమనించుకుని ప్రాణత్యాగం ఆలోచనను విరమించి ఇలా ఆలోచించసాగెను . "నాకు శుభశకునములు కలుగుతున్నాయి . వీటిని బట్టీ చూస్తుంటే త్వరలో నాకు మంచి జరుగుతుందని అర్ధమవుతోంది . బహుశా నా ప్రాణనాధుడు నా కొరకు వేటుకు ప్రయత్నమూ చేయుచున్నాడేమో ?లేక ఇటుగా నన్ను వెతుకుతూ వచ్చుచున్నాడేమో ?"అని ఆలోచించుతూ ఆ మహా సాధ్వి మనసు కొంత శోకము నుండి ఉపశమనము పొంది సంతోషము పొందెను . 

రామాయణము సుందరకాండ ఇరువదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment