రామాయణము
బాలకాండ -ఏబదియేడవసర్గ
విశ్వామిత్రుడు , వశిష్టుని వలన తనకు కలిగిన పరాభవమును తలచుకుని బాధపడుతూ ,దక్షిణ దిక్కుగా వెళ్లి ఫల మూలములను మాత్రమే తింటూ ఇంద్రియ నిగ్రహముతో తీవ్రమైన తపస్సుని ఆచరించెను . ఆలా చాలాకాలము చేసిన పిమ్మట బ్రహ్మ ప్రత్యక్షమై "నీవాచరించిన ఈ తపశ్చర్యను బట్టీ నిన్ను "రాజర్షి "గా గుర్తించుచున్నాను . అని పలికి తనతో పాటు వచ్చిన దేవతలతో సహా అంతర్ధానమయ్యెను .
అప్పుడు విశ్వామిత్రుడు "నేనింతటి తీవ్ర తపస్సు చేసినను సమస్త దేవతలు .బ్రహ్మ నన్ను రాజర్షి గానే గుర్తించారు . నా తపస్సుకి తగిన ఫలితము లభించలేదు "అని బాధపడుతూ మునిపటికంటే తీవ్రముగా తపస్సు చేయసాగెను .
ఇదే కాలములో ఇక్ష్వాకు వంశ ప్రముఖుడు అయిన "త్రిశంకు "మహారాజు రాజ్యమును పాలించుచువుండెను . అతడు సత్యవాది ,జితేంద్రియుడు ,అన్ని విధములుగా ఖ్యాతికెక్కినవాడు . ఆయనకు గొప్ప యజ్ఞాలు చేసి ఆ ప్రభావంతో సశరీరంగా స్వర్గానికి వెళ్లాలనే కోరిక పుట్టెను . వెంటనే అతడు వశిష్ట మహర్షిని ఆహ్వానించి ,ఆయనకు తన కోరికను తెలిపెను . అప్పుడు మహాత్ముడైన వశిష్ఠుడు అది అసాధ్యము అని చెప్పెను . అయినను త్రిశంకు ఎదో విధముగా తన కోరికను తీర్చుకోవాలనే ఆశతో దక్షిణ దిశగా ప్రయాణించి వశిష్టుని పుత్రులను చూసి వారికి వారిని ప్రార్ధించి తన కోరిక ఎట్లైనను నెరవేర్చమని వేడుకొనెను వశిష్ఠుడు నిరాకరించెనని కూడా తెలిపెను .
రామాయణము బాలకాండ ఏబదియేడవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment