రామాయణము
బాలకాండ _అరువది తొమ్మిదవ సర్గ
మరునాడు ఉదయమే దశరథ మహారాజు సంతోషము తో సుమంత్రుడితో "కోశాధికారులు అందరూ సమృద్ధిగా ధనమును,రత్నములు ,బంగారు ఆభరణములు ,మొదలగు పెండ్లికి కావలిసిన వస్తువులను సమృద్ధిగా తీసుకుని ముందుగా వెళ్లవలెను . చతురంగ బలములు ముందు వెళ్లవలెను . వశిష్ట మహర్షి ,వామదేవుడు ,జాబాలి ,కశ్యపుడు ,మార్కండేయుడు ,కాత్యాయనుడు అట్లే ఈ బ్రాహ్మణోత్తములందరూ విధముగా ముందుగా తరలిపోవుదురు . ఏ మాత్రము జాగు చేయక నా రధమును సిద్దము చేయుము . "అని పలికి . ఆ విధముగా అయోధ్యకు బయలుదేరివెళ్లెను .
జనక మహారాజు దశరథ మహారాజుకి ఎదురువెళ్ళి సముచితముగా స్వాగత సత్కారములు చేసి ,ఆయన రాక తన అదృష్టముగా భావించి వైభవోపేతముగా ఆహ్వానించెను . రాముడు దశరధుని రాకను గురించి తెలుసుకుని ఆయన విడిది భావనమునకు వెళ్లి ఆయనకు పాదాభివందనం చేసెను . రామలక్ష్మణులను చూసి దశరధుడు ఎంతో మురిసిపోయెను .
మరునాడు ఉదయము జనక మహారాజు తన యజ్ఞమును పూర్తి చేసుకుని కుమార్తె వివాహమునకు అంకురార్పణ చేసెను .
రామాయణము బాలకాండ అరువది తొమ్మిదవ సర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment