రామాయణము
బాలకాండ -అరవదియొకటవ సర్గ
ఆ విధముగా అందరూ ఇటువారు అటు వెడలగా విశ్వామిత్రుడు ,పశ్చిమ దిశలో కల మూడు బ్రహ్మ తీర్ధములలో కల తపో వనములో తపము ఆచరించుటకు వెళ్లెను . అచట తీవ్రమైన తపస్సు చేయుచుండెను .
అదే సమయములో అయోధ్యేయాధీశుడైన అంబరీష మహారాజు గొప్ప యజ్ఞమును తలపెట్టెను . అతడి యజ్ఞ పశువుని ఇంద్రుడు అపహరించుకుపోయేను . అందులకు మిగుల చింతించుచు ,గురువుల సలహా ప్రకారము కోరినవన్నీ ఇచ్చి ఎవరిని ఒక మానవుడిని యజ్ఞ పశువుగా చేసుకొనుటకు వెతుకుచుండెను . అలా వెతుకుతూ ఋచీక మహర్షి వద్దకు చేరి ,ఆయనకు నమస్కరాము చేసి ,కుశల ఆయనను ప్రసన్నుడిని చేసుకుని ,జరిగిన విషయము చెప్పి ,యజ్ఞపశువుగా వారి కుమారుడిని కోరెను . బదులుగా తగిన మూల్యమును చెల్లించెదనని చెప్పెను .
అప్పుడు ఋచీకుడు "ఓ రాజా !నా పెద్దకుమారుడన్న నాకు పరమ ప్రీతి కావున అతడిని నీకు అమ్మజాలను . "అని చెప్పెను . ఋచీకుడి పత్ని "చిన్న కుమారుడన్న నాకు అత్యంత ఇష్టం కావున నా చిన్న కుమారుడిని నేను ఇవ్వను "అని పలికెను . పరిశేష న్యాయం అనుసరించి ,మధ్యమ కుమారుడైన శునస్సేపుని తనతో తీసుకు వెళ్తు బదులుగా లక్షగోవులను ఇచ్చి సంతోషముగా ఇంటి దాని పట్టెను .
రామాయణము బాలకాండ అరవదియొకటవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment