Wednesday 7 September 2016

రామాయణము బాలకాండ -అరువదిరెండవసర్గ

                         రామాయణము 

                  బాలకాండ -అరువదిరెండవసర్గ               

ఆ విధముగా తానూ యజ్ఞ పశువుని అయినందుకు బాధపడుతూ అంబరీష మహారాజుతో ముందుకు సాగుతున్న శునస్సేపుడు ,మధ్యాహ్న కాలమగుటచే పుష్కర క్షేత్రమందు మహారాజు విశ్రమించగా అక్కడ తిరుగుతూ ,విశ్వామిత్రుని చూసి ,మిగుల దుఃఖముతో విశ్వామిత్రుని వడిలో వాడి ఏడవసాగెను . విశ్వామిత్రుడు కారణమడుగగా ,శునస్సేపుడు జరిగిన వృత్తాoతము అంతా చెప్పి ,"రాజుగారి యజ్ఞము నిర్విఘ్నముగా సాగునట్లు చేయుము ,అట్లే నన్ను రక్షించుము" . అని కోరెను 
అంత విశ్వామిత్రుడు శునస్సేపుని ,ఓదార్చి ,అభయమిచ్చి తన కుమారులలో ఎవరో ఒకరిని శునస్సేపునికి బదులుగా యజ్ఞ పశువుగా వెళ్ళమని చెప్పెను . దానికి వారు "కుమారుల ప్రాణములు బాలి యిచ్చి అన్యులను కాపాడుట అకృత్యము "అని పలికిరి . అప్పుడు విశ్వామిత్రుడు వారిని ముష్టిక జాతులలో జన్మించి కుక్క మాంసము తింటూ బతకమని శపించెను . 
శునస్సేపునికి అభయమిచ్చి ఇలా పలికెను . "ఓ ముని కుమారా !యజ్ఞమునందు నిన్ను పవిత్రమైన దర్భలతో బంధించి ,ఎర్రని పూలమాలలతో అలంకరింతురు . అప్పుడు నీవు విష్ణుదేవతా సంభందిత యూపీఏ స్తంభము వద్దకు వెళ్లి అగ్నికి అభిముఖంగా నిలబడి ,ఇంద్రుని ,ఉపేంద్రుని స్తుతించు . పిమ్మట నేను ఉపదేశించబోవు ఇంద్ర ,ఉపేంద్ర గాధలను గానము చేయుము . అప్పుడు నీ మనోరధము నెరవేరుతుంది . 
విశ్వామిత్రుడు బోధించిన మంత్రములను ,గాధలను గ్రహించి ,తిరిగి అంబరీష మహారాజు వద్దకు వెళ్లి ఆయనతో కలసి యజ్ఞ భూమికి వెల్లెను . అక్కడ యజ్ఞ పశువు అయిన ముని కుమారుని దర్భలతో బంధించి ,చందనంతో ,ఎర్రటి మాలతో అలంకరించి ,ఎర్రని వస్త్రములను ధరింపచేసి యూపస్తంభమునకు కట్టెను . అప్పుడు శునస్సేపుడు విశ్వామిత్రుడు చెప్పినట్లు ఇంద్రుడిని ఉపేంద్రుడిని స్తుతించెను అంతట ఇంద్రుడు మిక్కిలి సంతోషముతో శునస్సేపునికి దీర్గాయువును ప్రసాదించెను . అంబరీష మహారాజుకి యజ్ఞ ఫలము దక్కేను . 

రామాయణము బాలకాండ అరువదిరెండవసర్గ సమాప్తము . 

    శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment