Friday 2 September 2016

రామాయణము బాలకాండ -ఏబదియెనిమదవ సర్గ

                                 రామాయణము 

                                బాలకాండ -ఏబదియెనిమదవ సర్గ 

త్రిశంకు వచనములు విన్న వశిష్టుని పుత్రులు మిక్కిలి కోపముతో ఆయన మాటను కాదని యజ్ఞము జరిపించి ఆయనను అవమానించలేము . అని స్పష్టముగా చెప్పెను . గురుపుత్రుల మాటలు విని త్రిశంకువు" మా కులగురువు అయిన వశిష్ఠుడు ,వారి పుత్రులు అయిన మీరు నా కోరికను తిరస్కరించిరి . మంచిది నేను మరియొక దారి చూసుకొనెదను ."అని పలికెను . 
గురు పుత్రులు త్రిశంకువు వశిష్ట మహర్షి మాటలు ఉల్లంగించుటయే కాక ,మరియొకటి వద్దకు వెళ్తాను అనే మాట కు మిక్కిలి కోపం చెంది చండాలుడవు అవుతావు అని శపించిరి . త్రిశంకువు తన పురమునకు వెళ్లి జరిగినది తలుచుకుంటూ ఉండెను . మరునాడు తెల్లవారి లేచేసరికి త్రిశంకువు నల్లటి రూపముతో ఛండాలత్వమును పొందెను . అతని దుస్తులు సైతము నల్లగా మారిపోయెను . జుట్టు కురచగా మారెను . అతనిని చూసిన మంత్రులు ,అధికారులు భయముతో పరిగిడిరి . జనులు సైతము గుర్తింపకుండిరి . దానితో వంటరి అయిన త్రిశంకువు రాత్రియంబవళ్ళు దుఃఖముతో కృంగిపోవుచు ,చివరికి వశిష్ఠుడి తో వైరభావము కల విశ్వామిత్రుని వద్దకు చేరెను . 
విశ్వామిత్రుడు అతడి రూపము భాద చూసి జాలిపడెను . అతడి ఈ రూపమునకు ,భాదకు కారణమును అడిగెను . 
దానికి త్రిశంకువు తన స్వర్గమునకు వెళ్ళవలననే కోరిక అది తిరస్కరింప బడిన విధము ఆ క్రమములో తాను శపింపబడుట సమస్తము తెలిపెను . మరియు ఇలా పలికెను . "స్వామి !నేను అనేక యజ్ఞములు యాగములు చేసాను ,అనేక దానములు చేసాను . ఎప్పుడు అసత్యము ఆడి ఎరుగను . ప్రజలను ధర్మము అనుసరించి పాలించితిని . అటువంటి నాకు ఇప్పుడు ఈ దుస్థితి వచ్చింది . అయినను నాకు స్వర్గమునకు శరీరముతో వెళ్లాలనే కోరిక పోలేదు . నా ఈ కోరిక తీర్చుటకు మీరే సమర్థులు . ఇక నేను ఇతరులను ఎవ్వరిని ఆశ్రయించను,మీరు తప్ప నన్ను ఆడుకొనగలవారు ఎవ్వరును లేరు . నాయెడ అనుగ్రహమును చూపి ,దైవమును నాకు అనుకూలముగా చేయుటకు అనగా నా అదృష్టమును పండించుటకు మేరె తగుదురు . 

రామాయణము బాలకాండ ఏబదియెనిమిదవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  










                                 

No comments:

Post a Comment