Friday 9 September 2016

రామాయణము బాలకాండ -అరువదినాల్గవసర్గ

                         రామాయణము 

                       బాలకాండ -అరువదినాల్గవసర్గ 

దేవేంద్రుడు రంభను పిలిపించి విశ్వామిత్రుడి తపమునకు విఘ్నము కలిగించమని చెప్పెను . అందులకు రంభ భయపడుతూ ,సిగ్గుపడుతూ "ఓ దేవేంద్రా !ఆ విశ్వామిత్రుడు ముక్కోపి . నేను అతడి తపస్సు భంగము చేసిన ,అతడు నన్ను భస్మము చేసేదడు అందులకే  నేను భయపడుతున్నాను . "అని పలికెను . అప్పుడు ఇంద్రుడు "రంభా భయపడకు . ఇది నా ఆజ్ఞ అనుసరించు . వసంత ఋతువున వృక్షములన్నీ కొత్త చిగుళ్లతో ,పుష్పములతో విలసిల్లుతుండగా ఆ సమయములో మన్మధుడితో కూడి నీకు దగ్గరలోనే వుంటాను "అని పలుకగా 
రంభ ఇంద్రుని శాసనమును అనుసరించి పరం ఆకర్షణీయముగా తయారయి చిరునవ్వులు నవ్వుతూ ,విశ్వామిత్రుని ప్రలోభ పెట్టసాగెను . విశ్వామిత్రుడు మధుర కోకిల ధ్వని విని కళ్ళు తెలిచి చూసేను . ఎదురుగా వున్న రంభను చూడగా ఆయనకు సందేహము కలిగెను . అదంతా ఇంద్రుని పన్నాగము అని గ్రహించి మిక్కిలి కోపముతో 10000సంవత్సరములు శిలగా పడివుండు అని రంభని శపించెను . మహర్షి రంభను శపించు  వచనములు విని ఇంద్రుడు ,మన్మధుడు నెమ్మిదిగా అటునుండి ఆటే పోయెను .  రంభను  శపించిన పిమ్మట మహాతేజస్వి అయినా విశ్వామిత్రుడు తన కోపమును నిగ్రహించుకోలేకపోయినందుకు మిక్కిలి బాధపడెను . మహర్షి శాప ప్రభావమున రంభ కఠోర శిలగా మారిపోయెను . కోపమునకు లోనగుటచే ఆయన తపోబలము తగ్గిపోయెను . ఇక కోపమునకు ఏమాత్రము తావివ్వకూడదని నిర్ణయించుకుని , ఊపిరి బిగపట్టి కుంభములో ఉండి ,గాలి పీల్చకుండా ,ఆహారము స్వీకరించకుండా కఠోర తపస్సు చేయవలెనని నిర్ణయించుకొనెను . 

రామాయణము బాలకాండ అరువదినాల్గవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 










No comments:

Post a Comment