రామాయణము
బాలకాండ -అరువదినాల్గవసర్గ
దేవేంద్రుడు రంభను పిలిపించి విశ్వామిత్రుడి తపమునకు విఘ్నము కలిగించమని చెప్పెను . అందులకు రంభ భయపడుతూ ,సిగ్గుపడుతూ "ఓ దేవేంద్రా !ఆ విశ్వామిత్రుడు ముక్కోపి . నేను అతడి తపస్సు భంగము చేసిన ,అతడు నన్ను భస్మము చేసేదడు అందులకే నేను భయపడుతున్నాను . "అని పలికెను . అప్పుడు ఇంద్రుడు "రంభా భయపడకు . ఇది నా ఆజ్ఞ అనుసరించు . వసంత ఋతువున వృక్షములన్నీ కొత్త చిగుళ్లతో ,పుష్పములతో విలసిల్లుతుండగా ఆ సమయములో మన్మధుడితో కూడి నీకు దగ్గరలోనే వుంటాను "అని పలుకగా
రంభ ఇంద్రుని శాసనమును అనుసరించి పరం ఆకర్షణీయముగా తయారయి చిరునవ్వులు నవ్వుతూ ,విశ్వామిత్రుని ప్రలోభ పెట్టసాగెను . విశ్వామిత్రుడు మధుర కోకిల ధ్వని విని కళ్ళు తెలిచి చూసేను . ఎదురుగా వున్న రంభను చూడగా ఆయనకు సందేహము కలిగెను . అదంతా ఇంద్రుని పన్నాగము అని గ్రహించి మిక్కిలి కోపముతో 10000సంవత్సరములు శిలగా పడివుండు అని రంభని శపించెను . మహర్షి రంభను శపించు వచనములు విని ఇంద్రుడు ,మన్మధుడు నెమ్మిదిగా అటునుండి ఆటే పోయెను . రంభను శపించిన పిమ్మట మహాతేజస్వి అయినా విశ్వామిత్రుడు తన కోపమును నిగ్రహించుకోలేకపోయినందుకు మిక్కిలి బాధపడెను . మహర్షి శాప ప్రభావమున రంభ కఠోర శిలగా మారిపోయెను . కోపమునకు లోనగుటచే ఆయన తపోబలము తగ్గిపోయెను . ఇక కోపమునకు ఏమాత్రము తావివ్వకూడదని నిర్ణయించుకుని , ఊపిరి బిగపట్టి కుంభములో ఉండి ,గాలి పీల్చకుండా ,ఆహారము స్వీకరించకుండా కఠోర తపస్సు చేయవలెనని నిర్ణయించుకొనెను .
రామాయణము బాలకాండ అరువదినాల్గవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు .
No comments:
Post a Comment