రామాయణము
బాలకాండ _అరువది ఎనిమదవసర్గ
జనకమహారాజు ఆదేశమును అనుసరించి మంత్రులు మూడు రోజులు నిర్విరామముగా ప్రయాణించి ,అయోధ్య చేరి దశరధుని అనుమతి తీసుకుని ,రాజభవనమున ప్రవేశించి దశరథ మహారాజుని దర్శించిరి . పిమ్మట ఆయన క్షేమసమాచారమును అడిగి ,జనక మహారాజు పంపిన వర్తమానమును తెలిపిరి ." విశ్వామిత్రుడి ఆజ్ఞను ,శతానందుని సూచనను అనుసరించి మా జనక మహారాజు ఈ వర్తమానమును మీకు తెలిపి మిమ్ము సవినయముగా తోడ్కొని రమ్మంటిరి "అని పలికిరి .
అంతట సభలోని మహర్షులు మున్నగు వారు బాగుబాగు అని పలికిరి . అప్పుడు దశరధుడు పరమానందభరితుడై "రేపే ప్రయాణము "అని మంత్రులతో పలికెను . వారు ప్రయాణ సన్నాహములు చేసిరి .
No comments:
Post a Comment