Thursday 15 September 2016

రామాయణము బాలకాండ _అరువది ఎనిమదవసర్గ

                        రామాయణము 

                      బాలకాండ _అరువది ఎనిమదవసర్గ 


జనకమహారాజు ఆదేశమును అనుసరించి మంత్రులు మూడు రోజులు నిర్విరామముగా ప్రయాణించి ,అయోధ్య చేరి దశరధుని అనుమతి తీసుకుని ,రాజభవనమున ప్రవేశించి దశరథ మహారాజుని దర్శించిరి . పిమ్మట ఆయన క్షేమసమాచారమును అడిగి ,జనక మహారాజు పంపిన వర్తమానమును తెలిపిరి ." విశ్వామిత్రుడి ఆజ్ఞను ,శతానందుని సూచనను అనుసరించి మా జనక మహారాజు ఈ వర్తమానమును మీకు తెలిపి మిమ్ము సవినయముగా తోడ్కొని రమ్మంటిరి "అని పలికిరి . 
అంతట సభలోని మహర్షులు మున్నగు వారు బాగుబాగు అని పలికిరి . అప్పుడు దశరధుడు పరమానందభరితుడై "రేపే ప్రయాణము "అని మంత్రులతో పలికెను . వారు ప్రయాణ సన్నాహములు చేసిరి . 

రామాయణము బాలకాండ అరువది ఎనిమిదవసర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .         






No comments:

Post a Comment