Thursday 8 September 2016

రామాయణము బాలకాండ -అరువది మూడవసర్గ

                                            రామాయణము 

                                      బాలకాండ  -అరువది మూడవసర్గ 

విశ్వామిత్రుడు చాలాకాలము తీవ్ర తపస్సు చేయగా బ్రహ్మ దేవతలతో కోడి వచ్చి ఆయనకు ఋషిత్వము ప్రసాదించెను . దానికి విశ్వామిత్రుడు తృప్తి చెందక మరల తీవ్ర తపస్సు చేయసాగెను . ఆ విధముగా తీవ్ర తపస్సు చేయుచున్న విశ్వామిత్రుడి వద్దకు దేవతలు పంపగా ఆయన తపస్సుని భంగము చేయుటకు మేనక అను అప్సరస స్వర్గలోకము నుండి వచ్చి విశ్వామిత్రుడి కంట పడెను . 

వారిరువురు ఆశ్రమమందు ఏంటో సంతోషముగా ఉండిరి (విశ్వామిత్రుడి తపస్సు ఉట్టికెక్కెను ). ఆ విధముగా 10 సంవత్సరములు గడిచినవి . వారికి ఒక కుమార్తె కలిగెను . ఆమే శకుంతల ఆమె సంతానము అయిన భరతుడు పేరు మీదనే మన దేశమునకు భారతదేశము అను పేరు వచ్చినది . విశ్వామిత్రుడు తన తపస్సు భంగము అయినందుకు సిగ్గుపడి బాధపడుచుండెను . ఆయనను చూసి మేనక మిగుల భయపడసాగెను . అలా భయపడుతున్న మేనకను చూసి ఇందు నీ తప్పు ఏమిలేదు . నేనే కామపారాత్రాంతుడనై ఈ అపరాధము చేసితిని అని పలికి ఆమెను పంపివేసెను . అనంతరము కౌశికుడు (కుశికుని మనవడు అయినా విశ్వామిత్రుడు )ఉత్తరమున వున్నహిమాలయములకు వెళ్లి తపస్సు చేయసాగెను . 
ఆ విధముగా ఘోర తపస్సు చేయుచున్న విశ్వామిత్రుని వద్దకు బ్రహ్మ ,దేవతల తో కూడి వచ్చి "నాయనా! నీవు ఋషులలో ముఖ్యుడవు . నీ తీవ్రతపస్సు కి మెచ్చాను . నీకు మహర్షిత్యము ప్రసాదిస్తున్నాను . "అని పలికి అంతర్ధానమయ్యెను . వారందరూ వెడలిపోగా విశ్వామిత్రుడు మరల అతి తీవ్రముగా వాయువును మాత్రమే ఆహారముగా తీసుకుంటూ తపస్సు చేసెను . 
కఠోర నియమములతో తపస్సు చేస్తున్న విశ్వామిత్రుడిని చూసి ఇంద్రాది దేవతలు ఆయన తపస్సును భంగపరచటానికి రంభను పంపించడానికి నిశ్చయించుకుని ఆమెతో ఇలా అనెను . 

రామాయణము బాలకాండ అరువది మూడవసర్గ సమాప్తము . 

            శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 















No comments:

Post a Comment