Monday 5 September 2016

రామాయణము బాలకాండ -అరువదియవ సర్గ

                            రామాయణము 

                       బాలకాండ -అరువదియవ సర్గ 

ఆ విధముగా శపించిన తర్వాత అక్కడ వున్న ఋషులు ,మునులతో "ఇతడు సుప్రసిద్దుడైన ఇక్ష్వాకు వంశ మహారాజు ,ధార్మికుడు ,దానశీలుడు సశరీరము గా స్వర్గమునకు వెళ్ళవలెననే కోరికతో నన్ను ఆశ్రయించివున్నాడు . యజ్ఞప్రభావమున యితడు స్వర్గమునకు చేరునట్లు మనము ఒక క్రతువును నిర్వహించవలెను . "అని చెప్పెను . 
ఆయన మాటలు విన్న ఋషులు ,మునులు విశ్వామిత్రుని మాటలు విని తమలో తాము ఈ విశ్వామిత్రుడు ముక్కోపి . ఆయన చెప్పినట్లే చేయుదుము . నిప్పులాంటివాడు ,ఆయనకు కోపము వచ్చినచో శపించగలడు . కావున ఆయన చెప్పినట్లు చేయుదుము . యాగ ఏర్పాట్లు చేయండి . ఈ యాగమునకు విశ్వామిత్రుడు ఆధ్వర్యము వహిస్తాడు  అనుకొనెను . 
యజ్ఞము చక్కగా జరుగుతోంది హావిర్భాగములు అందుకోవడానికి దేవతలు రావట్లేదు . అప్పుడు విశ్వామిత్రుడు కోపముతో ఊగిపోతూ ,"ఓ నరేంద్రా !నా తపః శక్తిని చూడు ఇప్పుడే నిన్ను సశరీరంగా స్వర్గమునకు పంపుతాను . నేను పెక్కు ఏండ్లు చేసిన అమోఘ తపః శక్తిని ధారపోసి నిన్ను స్వర్గానికి పంపుతాను . "అని పలికేను . త్రిశంకువు అందరూ చూస్తుండగానే ఆకాశము వైపు ఎగిరి వెళ్లెను . స్వర్గానికి వచ్చిన త్రిశంకువుని చూసి ఇంద్రుడు సకల దేవతల సమక్షంలో "ఓ త్రిశంకూ వెళ్ళిపో ,నీవు స్వర్గానికి అనర్హుడివి . నీవు గురువు చేత శపింపబడ్డావు కావున నీవు స్వర్గానికి రాలేవు . తలక్రిందులుగా భూమి మీదకు పడిపొమ్ము "అని పలుకగా ,ఆ త్రిశంకువు తలక్రిందులుగా భూమిమీద పడిపోవసాగెను . అలా పడిపోతున్న త్రిశంకుడిని చూసి విశ్వామిత్రుడు "ఆగుము "అని పలికి ఆ త్రిశంకుని అక్కడే నిలిపి ఋషులు ,మునులు అందరూ చూస్తుండగా మరియొక నక్షత్రమండలిని ,మరియొక సప్తర్షిమండలమును ,స్వర్గమును సృష్టించెను .

అప్పుడు అక్కడి మునులందరూ ,దేవతలు ,సప్తఋషులు "ఓ మహానుభావా !తపోధనా !ఈ త్రిశంకువు గురువు చేత శపింపబడెను .. కనుక యితడు సశరీరంగా స్వర్గమునకు చేరుటకు అనర్హుడు "అని పలికిరి . 
అప్పుడు విశ్వామిత్రుడు ఇతడికి సశరీరంగా స్వర్గమునకు పాముతానని మాట ఇచ్చాను కావున నేను సృష్టించిన ఈ స్వర్గము ,నక్షత్రమండలము శాశ్వతముగా ఉంటాయి . అని పలికెను 
అప్పుడు దేవతలు ఋషులు "సరే అట్లే కానిండు . కానీ అతడు గురువుకు చేసిన అపచారం ఫలితముగా తలక్రిందులుగా ఉండును . "అని పలికి తమ స్థానములకు వెళ్లిరి . యజ్ఞము సమాప్తి అయినది . ఋషులు ,మునులు వారి వారి ప్రదేశములు వెళ్లిరి . 
రామాయణము బాలకాండ అరువదియవ సర్గసమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









No comments:

Post a Comment