రామాయణము
అయోధ్యకాండ -ఐదవసర్గ
దశరథ మహారాజు వశిష్ట మహర్షిని పిలిపించి శ్రీరామునికి ఉపవాస దీక్షను మంత్రపూర్వకముగా ఉపదేశించమని కోరెను . అంతట వశిష్ట మహర్షి వేగముగా వేళ్ళు గుఱ్ఱములతో కట్టబడిన రధమును ఎక్కి వేగముగా రాముని భావనమునకు వెళ్లి ,రాధముతోనే మూడు ప్రాకారములను దాటెను . వశిష్ట మహర్షి వచ్చిన విషయము తెలుసుకుని శ్రీరాముడు త్వరత్వరగా వశిష్ట మహర్షికి ఎదురేగి ఆహ్వానము పలుకుతూ తానె స్వయముగా రధము నుండి చేయి సాయము ఇచ్చి దింపెను . ఆయన ప్రవర్తనకు సంతోషించిన వశిష్ఠుడు తాను వచ్చిన కారణము తెలిపి సీతారాములకు మంత్రం పూర్వకముకా ఉపవాస దీక్షను అనుగ్రహించెను .
పిమ్మట వశిష్ట మహర్షి తిరిగి బయలుదేరి రాజవీధులోకి తన రధము మీద రాగా వీధులన్నీ ఏంటో చక్కగా అలంకరించబడి రామణీయముగా తీర్చిదిద్దబడ్డాయి . ఆ అయోధ్యలోని అన్ని ఇల్లు తమ ఇంట్లోనే వేడుక అన్నట్లుగా అలంకరించి వున్నవి . ప్రతి ఇంటి మీదను ధ్వజపతాకము ఎగురవేసి ఉండెను . ఆ వీధులన్నీ శ్రీరామ పట్టాభిషేకము చూడాలనే కోరికతో ఉవ్విళ్ళూరుతున్న జనముతో నిండి వున్నవి . ఆ విధముగా వున్న అయోధ్య నగర సౌందర్యమును వర్ణించుట వర్ణనాతీతము . వీటన్నిటిని చూస్తూ వశిష్ఠుడు దశరధుని భవనమునకు ప్రవేశించి ,శ్రీరామునికి ఉపవాస దీక్ష అనుగ్రహించిన సంగతి తెలియబరిచెను .
రామాయణము అయోధ్యకాండ ఐదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment