Friday 30 September 2016

రామాయణము అయోధ్యకాండ _ఏడవసర్గ

                         రామాయణము 

             అయోధ్యకాండ _ఏడవసర్గ 

కైకేయి పుట్టినింటి నుండి వివాహ సమయములో మెట్టినింటికి వచ్చునప్పుడు ఆమె వెంట వచ్చిన అరణపు దాసీ మంధర . ఈమె పుట్టుపూర్వోత్తరములు తెలియరావు . శ్రీరామ పట్టాభిషేక ముహూర్తమునకు ముందు ఈమె యాదృచ్చికంగా అటు ఇటు తిరుగుతూ ప్రసాదము మీదకు ఎక్కెను . నగరంలోని వీధులు ,గృహములు చక్కగా అలంకరింపబడి ఉండుట అన్ని గృహములు మొదలగు ఎత్తు ప్రదేశములు మీద ధ్వజములు ఎగురుట ,జనులందరూ తలంటు పోసుకుని అందముగా అలంకరించుకుని ఉండుట చూసి ఆశ్చర్యపోయేను . 
సమీపమున గల మెడపై శ్రీరాముని పెంచిన దాది పట్టువస్త్రములు ధరించి ముఖమున సంతోషకాంతులు ఉప్పొంగుచున్నట్లుగా ఉండెను . ఆమెను చూసిన మంధర "దశరథ మహారాజు ఏదైనా గొప్ప ఘనకార్యము చేయబోతున్నారా ?నగరమంతా ,జనులంతా కళకళలాడుచున్నారు "అని అడిగెను . అంత ఆ దాది సంతోషముతో ఉక్కిరిబిక్కిరి అవుతూ "మహారాజ్యలక్ష్మి శ్రీరాముని వరించబోవుచున్నది . శాంత స్వభావుడు అయిన శ్రీరాముని  రేపే దశరథ మహారాజు యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేయబోతున్నారు ". అని గూని ముందరకు ఆ దాది చెప్పేను
ఆ మాటలు వినిన వెంటనే అసూయ చే దహింపబడు ఆ గూని మంధర కైలాసము వాలే ఎత్తుగా వున్న ఆ ప్రసాదమును గబగబా దిగి శయ్యపై పరుండిన కైక వద్దకు చేరి ఇలా పలికెను . "ఓ మూఢురాలా !లే భయంకరములైన పెను ఆపదలు ,దుఃఖ పరంపరలు నిన్ను చుట్టుముట్టబోవుచుండగా తెలుసుకోలేక ఇంకా ఇలా పరుంటివేలా ?. ఓ కైకా !నీ భర్తకు నీపైనే ఎనలేని ప్రేమున్నట్లు భ్రమపడుచున్నావు . వాస్తవముగా నీ అదృష్టము గ్రీష్మకాలములోని నాదీ జలముల వలె తరిగిపోవుచున్నది . "పాపాత్మురాలైన మంధర ఇట్లు పరుష వాక్యములు పలుకగా కైక విషాదమునకు లోనయ్యి "నీ ఈ భాదకు కారణమేమి అశుభమేమి సంభవించలేదుకదా " అని అడిగెను . 
కైకేయి హితము కోరు ఆ మంధర ఇంకనూ విషణ్ణ వదనురాలై ,ఇలా పలికెను . "ఓ దేవి !కపటి అయినా నీ భర్త భర్తకుడికి కాక శ్రీరాముడికి యువరాజుగా పట్టాభిషేకము చేయబోవుతున్నాడు . భరతుడిని బంధువుల ఇంటికి దూరముగా పంపి ఆయన రేపే రామునికి పట్టాభిషేకము చేయబోవుతున్నాడు . ఆ కారణముతో శోకాగ్నితో దహింపబడుతున్న నేను విలవిలలాడుతూ నీ హితము కోరి ఇటు వచ్చినాను . ఓ కైకేయి !నేకేమాత్రము ఆపద వచ్చినా నా వేదనకు అంతమే ఉండదు . ఓ కైక నీవు సమయోచితముగా సకల కార్యములను సాధించుకోగల సమర్థురాలవు . ఇప్పుడు నీ హితమును గూర్చి ఆలోచించు . అంతే కాదు నీ పుత్రుడైన భరతుడిని కూడా రక్షించుకో . "అని పలికెను . 
అప్పటివరకు శయ్య పై పరుండిన మంధర ఆ మాటలు విని పరమానంద భరితురాలై వికసితవదన అయి లేచి కూర్చుండి ,శ్రీరామపట్టాభిషేక వార్తా కు ఆశ్చర్యముతో సంతోషముతో ముందరకు ఓకే విలువైన ఆభరణమును బహూకరించేను . ఆ మంధరతో "ఓ మందరా !చాలా మంచి వార్తను తీసుకొచ్చావు . నాకు చాలా సంతోషముగా వుంది . రామ భరతులిద్దరూ నాకు సమానులే . నీవు ఇంతకంటే నాకు సంతోషకరమైన వార్త చెప్పలేవు . ఈ వార్త తెచ్చినందుకు గాను నీకు వరమును తప్పక ఇచ్చెదను . ఏమి వారము కావాలో వెంటనే కోరుకో "అని మంధరతో కైకేయి పలికెను . 

రామాయణము అయోధ్యకాండ ఏడవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ (తెలుగు ).తెలుగు పండితులు . 

                  
















No comments:

Post a Comment