Monday 4 March 2019

                                      రామాయణము 

                                      కిష్కిందకాండ-ఆరుబదిఐదవసర్గ 

అంగదుని మాటలు విన్న వానర వీరులు తమ తమ సామర్ద్యముల గురించి తెలుప సాగిరి . ఒక వీరుడు తాను  పది యోజనాల దూరము ఎగురగలనని మరొకవీరుడు ఇరువై యోజనాల దూరం ఎగురగలనని , ఇంకొక వీరుడు నేను ముప్పైయొజనాలాదూరం ఎగురగలనని తెల్పెను . ఇంతలో జాంబవంతుడు , తానూ తొంభైయోజనాల దూరం ఎగురగలనని కానీ ముసలివాడు అగునచో , ఇప్పుడు తమ సామర్ధ్యముపై అనుమానంగా వున్నదని పల్కెను అప్పుడు అంగదుడు తానూ వందయోజనాలాదూరం ఎగురగలనని కానీ తిరిగిరాగాలనోలేదోసందేహముగా ఉన్నదని  పలికెను . మరి ఈసముద్రమును దాట గల సమర్ధుడు ఎవరని వారిలోవారు తర్జన భర్జనలు పడసాగిరి . వీరందరూ ఈ విధముగా చేర్చించుకొనుచుండగా హనుమంతుడుమాత్రం . దూరముగా ఒంటరిగా కూరుకొనిఉండెను
తుదకు  జాంబవంతుడు , హనుమంతుడే  సముద్రమును దాటగల సమర్థుడని నిశ్చయానికి వచ్చెను . 

రామాయణము -కిష్కిందకాండ -అరుబదిఐదవ సర్గ సమాప్తం. 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ,(తెలుగు)తెలుగుపండితులు . 

No comments:

Post a Comment