రామాయణము
కిష్కిందకాండ-ఆరుబదిఐదవసర్గ
అంగదుని మాటలు విన్న వానర వీరులు తమ తమ సామర్ద్యముల గురించి తెలుప సాగిరి . ఒక వీరుడు తాను పది యోజనాల దూరము ఎగురగలనని మరొకవీరుడు ఇరువై యోజనాల దూరం ఎగురగలనని , ఇంకొక వీరుడు నేను ముప్పైయొజనాలాదూరం ఎగురగలనని తెల్పెను . ఇంతలో జాంబవంతుడు , తానూ తొంభైయోజనాల దూరం ఎగురగలనని కానీ ముసలివాడు అగునచో , ఇప్పుడు తమ సామర్ధ్యముపై అనుమానంగా వున్నదని పల్కెను అప్పుడు అంగదుడు తానూ వందయోజనాలాదూరం ఎగురగలనని కానీ తిరిగిరాగాలనోలేదోసందేహముగా ఉన్నదని పలికెను . మరి ఈసముద్రమును దాట గల సమర్ధుడు ఎవరని వారిలోవారు తర్జన భర్జనలు పడసాగిరి . వీరందరూ ఈ విధముగా చేర్చించుకొనుచుండగా హనుమంతుడుమాత్రం . దూరముగా ఒంటరిగా కూరుకొనిఉండెను
తుదకు జాంబవంతుడు , హనుమంతుడే సముద్రమును దాటగల సమర్థుడని నిశ్చయానికి వచ్చెను .
రామాయణము -కిష్కిందకాండ -అరుబదిఐదవ సర్గ సమాప్తం.
శశి,
ఎం.ఏ,ఎం.ఏ,(తెలుగు)తెలుగుపండితులు .
No comments:
Post a Comment