రామాయణము
కిష్కిందకాండ-అరువదిమూడవసర్గ
ఈ విధముగా సంపాతి వానర వీరులతో పలుకుతుండగానే, అందరు చూస్తుండ గానే సంపాతికి రెక్కలు మొలుచుకొచ్చేను అప్పుడు సంపాతి వానర వీరులతో "మిత్రులారా సూర్య కిరణముల వేడికి కాలి పోయిన నా రెక్కలు మళ్ళీ తిరిగివచ్చాయి. ముసలి వాడినైనా నాకు యువకునికి ఉండేటంత బలము శక్తీ లభించాయి . సీతాదేవి జాడ లభించుననుటకు ఇదే ప్రభల నిదర్శనం. గట్టి పూనికతో ప్రయత్నం చేయండి" . అని పలికెను . ఆ విధముగా పలికిన తరువాత సంపాతి తన రెక్కల బలము తెలుసుకోవాలని ఆకాశములోకి ఎగిరెను .
అప్పుడు వానర వీరులందరు పరమ సంతోషముతో పొంగిపోయిరి. నూతన ఉత్సాహముతో సీతాన్వేషణకు ఉన్ముఖులైరి .
రామాయణము-కిష్కిందకాండ - అరువదిమూడవ సర్గ
శశి ,
ఎం.ఏ,ఎం.ఏ , (తెలుగు),తెలుగుపండితులు .
No comments:
Post a Comment