రామాయణము
సుందరకాండ -ఏడవసర్గ
హనుమ లంకలో ఆ విధముగా సీతాదేవిని వెతుకుతూ గొప్పది ,బహు విశాలమైనది ,మహిమాన్వితమైనది ,అత్యంత సుందరమైనది ,చాలా అరుదైనది ఐన పుష్పకవిమానమును చూసేను . దానిపై అందమైన పెక్కు బొమ్మలు వేయబడి వున్నవి . అవి చాలా అందముగా వున్నవి . దానిలో లక్ష్మి దేవి తామరలతో నిండిన సరస్సు మధ్యలో .చేతిలో తామరలతో కూర్చున్నట్లుగా అందముగా చిత్రించబడి వున్నది . ఆ దేవికి ఇరుపక్కలా రేణు ఏనుగులు ఆ సరస్సులోని తామరలను తీసి ఆ దేవికి సమర్పిస్తున్నట్లుగా వున్నది . ఆ పుష్పక విమానమంతయు ,ఆ చుట్టుపక్కల మారుతి బాగుగా వెతికేను . కానీ ,శ్రీరాముని ధర్మపత్ని ఐన సీతామహాసాధ్వి మాత్రము కనిపించలేదు .
రామాయణము సుందరకాండ ఏడవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment