రామాయణము
కిష్కిందకాండ -అరువదియవసర్గ
తన తమ్ముడికి జల తర్పణములు వదిలిన పిమ్మట , సంపాతి వానరుల సహాయముతో పర్వతముపైన కూర్చుండెను ఆలా కూర్చున్న సంపాతి చుట్టూ వానరులు కూర్చుని ఉండిరి . అప్పుడు సంపాతి తిరిగి వానరులతో ఇలా చెప్పసాగెనును "ఓ వానరులారా నేను నా తమ్ముడు పోటీపడి పైకి ఎగిరినప్పుడు సూర్య రశ్మికి నా రెక్కలు శరీరములోని కొన్ని భాగములు కాలిపోయి నేను నెల మీద పడిపోయాను. ఆలా పడిన ఆరురోజుల తరువాత కళ్ళు తెరిచి చూసాను. ఇదువరుకే ఈ భూమండలమంతా తిరిగి ఉండుట చే ఈ ప్రాంతమును గుర్తుపట్టగలిగాను . ఈ ప్రాంతములో నిసాకారుడు అనే ముని ఒక ఆశ్రమమును ఏర్పరుచుకొని నివసించుచున్నారు ఆయన గొప్ప మహిమాన్వితుడు . ఆయన ఆశ్రమమునకు నేను ఎలాగోలా దేకుతూ వెళ్లాను ఇంతకుముందు నేను మా తమ్ముడు ఆయన ఆశ్రమముకు వెళ్లియున్నాము ఆ ముని నన్ను చూసి "ఏమిజరిగినది నీకు రెక్కలు ఎందుకు లేవు , నీ జుట్టు ఎందుకు అలా ఉన్నది , నీకు వచ్చిన రోగమేమి అని ప్రశ్నించెను .
No comments:
Post a Comment