రామాయణము
కిష్కిందకాండ-అరువదిఆరవసర్గ
జాంబవంతుడు హనుమంతున్ని ప్రేరేపించుచు , "ఓ ఆంజనేయ నీవు వానరులందరిలోకల్లా సర్వ శ్రేష్ఠుడవు . సకల శాస్త్రములలోను ఆరితేరినవాడవు , పుంజికస్థల అనే అప్సరస కపిశ్రేష్టుడైన కేసరికి భార్యగా జనించింది . ఆ ఉత్తమ దంపతులకు నీవు వాయు దేవుని వరమువల్ల జనించినావు .
కేసరి బల పరాక్రమములు, అలాగే వాయు దేవుని యొక్క బల పరాక్రమములను , కలిగియున్నావు . నీవు చిన్ననాటి నుండే మహా వీరుడవు .
నీ బాల్యములో ఒక నాడు నీవు సూర్యుని ఫలముగా భావించి దానిని ఆరగించుటకై సూర్యునివైపుగా ఎగరనారంభించావు . సూర్యుని దగ్గరదగ్గరకు వెళ్లి నప్పటికీ కూడా సూర్య కిరణముల వేడి నీకు ఏమాత్రమును హాని కలిగించలేకపోయినది .
సూర్య మండలం వైపుగా దూసుకు వస్తున్న నిన్ను చూసి ఇంద్రుడు కోపముతో తన వజ్రాయుధము ప్రయోగించెను . అపుడు నీవు భూమి మీద ఓ పర్వత శిఖరంపై పడిపోగా సుకుమారమైన నీ దవడలు దెబ్బ తిన్నవి అప్పటి నుండి నీవు హనుమంతుడు అనే పేరుతొ ప్రసిద్ధికెక్కెను .
అది చూసిన వాయుదేవుడు కోపముతో ముల్లోకాలు లోని గాలిని స్తంభింప జేసెను . అప్పుడు సకల దేవతలు వాయుదేవుని ప్రసన్నుడిని చేసుకొనిరి . అప్పుడు బ్రహ్మ దేవుడు ఏ ఆయుధముచేత నీకు మరణము లేకుండా స్వచ్చంద మరణమును వరంగా ఇచ్చెను . నీవు తిరుగు లేని వీరుడవు . పరాక్రమమున నీకు నువ్వే సాటి . ఇది లోకకళ్యాణము కోసం చేయు కార్యము దీనికి నీవే సర్వ సమర్థుడవు .ఈ వానర వీరులందరి ప్రాణములు నీ చేతిలోనే ఉన్నవి . అని జాంబవంతుడు పలుకగా మారుతికి తన వేగము బల సామర్ధ్యములపై నమ్మకము కుదిరెను. వెంటనే హనుమంతుడు వానరులకు ఉత్సాహము పెంచుతూ తన అద్భుత రూపమును ప్రదర్శించెను .
రామాయణము కిష్కిందకాండ అరువదిఆరవసర్గసమాప్తము .
శశి
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment