రామాయణము
సుందరకాండ -రెండవసర్గ
సముద్రమును దాటి తీరము చేరిన హనుమ లంకా నగరమును చూసి, ఆ నగరంలోకి ప్రవేశించుట ఎట్లు అని ఆలోచించసాగెను .
సీతాపహరణ కారణముగా లంకా నగరబయట భయంకరులైన అనేక మంది రాక్షసులు కాపలా కాస్తున్నారు . యదార్ధ రూపములో వెళితే లోపలి వెళ్ళుట అసాధ్యము . పైపెచ్చు వచ్చిన పని అవ్వకపోవచ్చు . ఈ మాయావులైన రాక్షసులను మోసగించి ,వారికి కనపడకుండా లంకా నగరంలోకి ప్రవేశించాలి . సీతాదేవిని వెతకాలి . అని మనసులో బాగుగా ఆలోచించుకుని చివరకు చీకటి పడిన తర్వాతే మార్జాల ప్రమాణములో లంకలోకి ప్రవేశించుట ఉత్తమమని హనుమ భావించెను .
రామాయణము సుందరకాండ రెండవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment